Bindhu Madhavi : బిగ్ బాస్ రియాలిటీ షోలో హౌస్ లో కెమెరాల మధ్య ఇంటి సభ్యులు ఏంచేస్తున్నారో మనకు గంట చూపించేవారు. అయితే ఇపుడు నాన్ స్టాప్ ఓటీటీ అంటూ 24 గంటలు వాళ్ళు ఏంచేస్తున్నారో చూసే వెసులుబాటు ప్రేక్షకులకు కల్పిస్తున్నారు. దీంతో ఇంటి సభ్యులు ఏమి చేసినా తప్పించుకునే వీలు లేదు. 24 గంటలు టెలికాస్ట్ అవడంవల్ల ప్రేక్షకులకు దొరికిపోతారు. ఇక ఇపుడు ఇలానే బిగ్ బాస్ సీజన్ ఆరు నాన్ స్టాప్ ఓటీటీ విన్నర్ విషయంలో ఇలాంటి సందేహాలు మొదలయ్యాయి.
సిగరెట్ తాగావా… లేదా…..
మొదటిసారి ఒక అమ్మాయి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంది. ఆడపులి అంటూ బిందు మాధవిని సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా చేసారు అభిమానులు. ఇక బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ గత శనివారం గ్రాండ్ గా జరిగింది. విన్నర్ గా బిందుకి గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. ఇక తాజాగా బిందు తన అభిమానులతో సోషల్ మీడియాలో లైవ్ చాట్ చేసింది. అందులో తనకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒక అభిమాని నువ్వు బిగ్ బాస్ హౌస్ లో సిగరెట్ తాగావా అని అడిగారు. దీనికి బిందు నేను అసలు స్మోక్ చేయను ఒకవేళ తాగాలనుకున్నా ఓపెన్ గానే చేస్తా కానీ దాచాల్సిన పని లేదు అని స్పష్టం చేసింది.
అయితే బిగ్ బాస్ హౌస్ లో బిందు, అషు రెడ్డి బాత్రూం లో స్మోక్ చేసారనే టాక్ బాగా వినిపించింది. ఈ విషయంపై అషు ని అడిగినా తప్పించుకుంది. అయితే హౌస్ లో ఈ విషయాన్ని మొదట నటరాజ్ మాస్టర్ కనిపెట్టారు, కొంతమంది నైట్ టైమ్స్ బాత్ రూమ్ కి వెళ్లి స్మోక్ చేస్తున్నారని చెప్పాడు. ఇక స్రవంతి, అఖిల్ కి ఇంక తన ఫ్రెండ్స్ కి బిందు మాధవి స్మోక్ చేస్తోందని చెప్పింది. కెమెరాకు చిక్కకుండా స్మోక్ చేసారన్నది వాదన అయితే చేయలేదని బిందు స్పష్టం చేసింది. ఇక బిందు కోరుకున్న విధంగా తాను టైటిల్ గెలవడంతో పాటు తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు కూడా తెచ్చుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…