Ramgopal Varma: రాంగోపాల్ వర్మ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే..వర్మ వేస్ట్ ఫెలో అంటూ ఆగ్రహం?
Ramgopal Varma: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా, రాజకీయాలు అనే తేడా లేకుండా అన్ని విషయాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పలుమార్లు వర్మ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఆయన రాష్ట్రపతి అభ్యర్థి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్నుని ఉద్దేశించి వర్మ ట్విట్టర్ లో.. ‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ’అంటూ వర్మ ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా వర్మ చేసిన ఈ ట్వీట్ పై బీజేపీ నేత రాజా సింగ్ వర్మ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ స్పందిస్తూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపతి ముర్మును ఈ విధంగా వర్మ కించపరుస్తూ ట్వీట్ చేశారని ఆయన పై మండిపడటమే కాకుండా వర్మ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ ఆదివాసీ రాష్ట్రపతి మహిళ అభ్యర్ధిపై వర్మ ఇలా పోస్ట్ చేయడం బాధాకరమన్నారు.
వర్మ తాగిన మత్తులో ఇలాంటి మాటలు మాట్లాడుతూ, ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంటారని రాజ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ఒక వేస్ట్ ఫెలో అంటూ వర్మ పై ఫైర్ అయ్యారు. ఈయన కేవలం రాంగోపాల్ వర్మపై మాత్రమే కాకుండా,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ పై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ పై రాజా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…