Featured

ఏలూరు వింతవ్యాధికి అసలు కారణమిదే.. రోగుల రక్తంలో ఏముందంటే..?

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ప్రజలు గత మూడు రోజులుగా వింత వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఏలూరులో ఈ వింతవ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం టెన్షన్ పెడుతోంది. నిన్నటివరకు ఆస్పతులలో వింత వ్యాధి లక్షణాలతో 464 మంది చేరగా వీరిలో ఒకరు మరణించారు. కొందరు రోగులను అధికారులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు తరలించారు.

అయితే రాష్ట్రంలోని ల్యాబుల్లో చేసిన పరీక్షల్లో ఇప్పటివరకు వింత వ్యాధికి గల కారణాలు తెలియలేదు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాత్రం ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి అసలు కారణం తెలిసిపోయిందని.. డిల్లీ ఎయిమ్స్ పరీక్షల్లో రోగుల రక్తం సాధారణంగా ఉండాల్సిన మోతాదు కంటే నికెల్, సీసం మెటల్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నివేదిక అందిందని తెలిపారు.

ఢిల్లీ ఎయిమ్స్‌ నిపుణులు వింత వ్యాధి బారిన పడిన ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో పాలు, నీళ్ల శాంపిల్స్ కావాలని కోరినట్లు సమాచారం. న్యూరో టాక్సిక్‌ లక్షణాలు కనిపించడానికి సీసం ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు, పాల ద్వారా శరీరంలోకి ఈ లోహం ప్రవేశించి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రజల శరీరంలోకి మెటల్స్ ఏ విధంగా వెళ్లాయో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు రోజురోజుకు వింత వ్యాధి కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికెళ్లిన వారిలోను మూర్చ లక్షణాలు కనిపిస్తూ ఉండటం గమనార్హం. ప్రజలు మాత్రం నీటి కాలుష్యం వల్లే ఈ విధంగా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

39 minutes ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

39 minutes ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

1 hour ago

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

2 hours ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

2 hours ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

3 hours ago