Featured

ఏలూరు వింతవ్యాధికి అసలు కారణమిదే.. రోగుల రక్తంలో ఏముందంటే..?

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ప్రజలు గత మూడు రోజులుగా వింత వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఏలూరులో ఈ వింతవ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం టెన్షన్ పెడుతోంది. నిన్నటివరకు ఆస్పతులలో వింత వ్యాధి లక్షణాలతో 464 మంది చేరగా వీరిలో ఒకరు మరణించారు. కొందరు రోగులను అధికారులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు తరలించారు.

అయితే రాష్ట్రంలోని ల్యాబుల్లో చేసిన పరీక్షల్లో ఇప్పటివరకు వింత వ్యాధికి గల కారణాలు తెలియలేదు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాత్రం ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి అసలు కారణం తెలిసిపోయిందని.. డిల్లీ ఎయిమ్స్ పరీక్షల్లో రోగుల రక్తం సాధారణంగా ఉండాల్సిన మోతాదు కంటే నికెల్, సీసం మెటల్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నివేదిక అందిందని తెలిపారు.

ఢిల్లీ ఎయిమ్స్‌ నిపుణులు వింత వ్యాధి బారిన పడిన ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో పాలు, నీళ్ల శాంపిల్స్ కావాలని కోరినట్లు సమాచారం. న్యూరో టాక్సిక్‌ లక్షణాలు కనిపించడానికి సీసం ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు, పాల ద్వారా శరీరంలోకి ఈ లోహం ప్రవేశించి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రజల శరీరంలోకి మెటల్స్ ఏ విధంగా వెళ్లాయో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు రోజురోజుకు వింత వ్యాధి కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికెళ్లిన వారిలోను మూర్చ లక్షణాలు కనిపిస్తూ ఉండటం గమనార్హం. ప్రజలు మాత్రం నీటి కాలుష్యం వల్లే ఈ విధంగా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

16 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

16 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

17 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

17 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

17 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

17 hours ago