ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు.. తాను చెల్లి వరుస అవుతానంటూ ఆమె నిరాకరించింది.. దీంతో

కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఇటు విద్యిర్థినీ విద్యార్థులు చాలామందికి స్నేహితులుగా మారుతారు. కొంతమందికి ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే జంటలు చాలా తక్కువగా ఉంటుంది. ధైర్యం చేసి ఇంట్లో చెప్పకపోవడం, టైం పాస్ గా లవ్ చేసి ఎవరి దారి వాళ్లు చూసుకోవడం.. ప్రేమ అంటే ఎంటో అర్థం తెలియకుండా.. ఎట్రాక్షన్ ను ప్రేమ అనే భ్రమలో ఉండటం లాంటి కారణాలతో పెళ్లి అనే కార్యం వరకు కొన్ని జంటలు వెళ్లవు.

అయితే మరికొన్ని జంటలు నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. కులాలు వేరు కావడంతో ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకునే జంటలో కూడా ఇరు కులాలు ఒక్కటే.. దీంతో ఆయువకుడు ఆమె ప్రేమ కోసం తహతహలాడుతూ ఓ రోజు ప్రపోజ్ చేశారు. ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుతున్నారు.

కానీ ఆమె అతడికి ఒక షాకింగ్ నిజం చెప్పింది. తాను నీకు చెల్లి వరుస అవుతానని. దీంతో ఆ యువకుడికి నోటి నుంచి మాట రాలేదు. కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ప్రేమను ఆ యువతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తర్వాత 5 రోజులకు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటు చేసుకుంది.

సంతులాల్‌పోడు తండా చెందిన వంశీ.. మహబూబాబాద్‌లో ఇంటర్‌ చదువుతూ ఉన్నాడు. కాలేజీలో గంధంపల్లి–కొత్తపేటకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ప్రేమిస్తున్నానని చెప్పడంతో చెల్లి వరుస అవుతాను అంటూ ఆమె చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.