కరోనా కారణంగా కొన్ని పరిశ్రమలు మూత పడగా.. మరి కొన్ని పరిశ్రమలు లాభాల భాటలో పయనిస్తున్నాయి. అందులో ఫుడ్ ఆధారిత పరిశ్రమలు అయితే లాక్డౌన్ వల్ల పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోవడం, సిబ్బంది లేకపోవడం వల్ల ఎక్కడి ఉత్పత్తి అక్కడే ఆగిపోయాయి. దీంతో ఫుడ్ పరిశ్రమలకు భారీగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం పలు ఫుడ్ పరిశ్రమలు తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
తాజాగా బ్రిటానియా కూడా క్రమంగా తన ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించింది. గతేడాది అంటే జూన్ 30, 2020తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండింతలై రూ.542.68 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.248.64 కోట్లు మాత్రమే.
మొత్తం ఆదాయం సైతం 26.97 శాతం వృద్ధితో రూ.2,767.8 కోట్ల నుంచి రూ.3,514.35 కోట్లకు చేరుకుంది. ప్రస్తతం కరోనా కారణంగా జూన్ త్రైమాసికం గడ్డుకాలంగా మారింది. లాక్డౌన్ వల్ల పలు ఇబ్బందులు తలెత్తాయి. దేశవ్యాప్తంగా ప్లాంట్లు, డిపోలు, రవాణా, వెండార్లకు సంబంధించిన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది.
ఇపుడు తిరిగి కరోనా పూర్వపు స్థాయికి పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నామని సంస్థ ఎంపీ వరుణ్ బెర్రీ తెలిపారు. అందుకే ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2 శాతం ఈ కామర్స్ వ్యాపారాన్ని 5 శాతానికి పెంచుకోవాలని బ్రిటానియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…