Featured

Byreddy Rajashekhar Reddy : వాళ్ళలా విశాఖపట్నంను ప్రత్యేక రాష్ట్రం చేయమనడం లేదు… మాకు రాజధాని కావాలి…: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Byreddy Rajashekhar Reddy : రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిగా గుర్తింపు ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాయలసీమ హక్కులను కాపాడండి అంటూ ఉపన్యాసలు ఇస్తున్నారు. రాయలసీమకు చెందిన సీఎం రాయలసీమ అభివృద్ధిని గాలికి వదిలేసాడంటూ విమర్శించారు. రాజధాని అమరావతిలో లేకపోతే కర్నూల్ లో ఉండాలి కానీ వైజాగ్ కి ఎలా తరలిస్తారు అంటూ ఫైర్ అయ్యారు.

వాళ్ళలా ప్రత్యేక రాష్ట్రం అడగలేదు… మా హక్కు అడుగుతున్నాం…

రాష్ట్ర విభజన తరువాత రాజదని అంశంలో పెద్ధ చర్చ జరిగింది. ఇక అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉందని భావించి అక్కడే పెట్టారు. ఇక ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ మొదలు పెట్టి ఇప్పుడు రాజధానిని విశాఖకు తరలితున్నట్లు చెప్పడంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని కానట్లయితే రాజధాని రాయలసీమలో ఉండాలంటూ అది మా హక్కంటూ చెప్పారు.

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. న్యాయ రాజధాని కర్నూల్ కి ఇస్తామని చెప్పి ఇప్పుడు మంగళగిరిలో జ్యూడిషల్ అకాడమీని ఏర్పాటు చేయడంతోనే కర్నూల్ కి మొండి చేయి చూపారని అర్థమవుతుంది అంటూ చెప్పిన ఆయన ధర్మాన ప్రసాద్ వంటి వారు వైజాగ్ ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ అనడం గురించి మాట్లాడుతూ అంత ఆశలు మాకేమీ లేవు, మేము అడుగుతున్నది రాజధాని మాత్రమే అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

56 minutes ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

1 hour ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

1 hour ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

2 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

2 hours ago

లేడీ యాంకర్ వల్లే కష్టాలు.. యాంకర్ రవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరలో తన ప్రత్యేక శైలితో గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ Anchor Ravi తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.…

2 hours ago