Category Archives: Health News

Butter Milk Side Effects: ఆరోగ్యానికి మంచిదని మజ్జిగ ఎక్కువ తాగుతున్నారా… ప్రమాదంలో పడినట్లే?

Butter Milk Side Effects: మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ ఉండటం సర్వసాధారణం అయితే పెరుగుతో పోలిస్తే చాలామంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉండడంతో ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారు.

1

ఇలా మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరం కూడా హైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని భావిస్తూ చాలామంది మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కాదని మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మనల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పాలు పాల పదార్థాలలోనూ లాక్టోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందిలో జీర్ణక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. ఎవరికైతే లాక్టోస్ ను జీర్ణం చేసే ఎంజైమ్‌ ఎక్కువగా ఉత్పత్తి కావు లాంటివారికి మజ్జిగ తాగటం వల్ల అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే కడుపు నొప్పి రావడం కడుపు చాలా ఉబ్బర కావడం విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా మంచిగా తీసుకోకపోవడం ఎంతో మంచిది.

చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి…

ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకు కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచిది ఇక చాలా మంది మజ్జిగలో ఉప్పు అధికంగా వేసుకొని తాగుతూ ఉంటారు ఇలా అధికంగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉప్పు నిలువలు పెరిగిపోయి హై బీపీ రావడానికి కూడా కారణం అవుతుంది. ఇక మరికొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రోజు ఒక గ్లాస్ కి మించి మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Pregnant After 40 Years: మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం మంచిదేనా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Pregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…

40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.

40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.

18 నెలల గ్యాప్ అవసరం…


మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Doctor Kiran : ఫోన్ వల్లే గుండె పోటు… వాక్సిన్ వల్ల జరుగుతోంది…: డాక్టర్ కిరణ్

Doctor Kiran : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండె పోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్త వయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు వంటి విషయాలను డాక్టర్ కిరణ్ వివరించారు.

వాక్సిన్ కాదు స్మార్ట్ ఫోన్ వల్లే గుండె పోటు…

మారుతున్న జీవన సరళి వల్ల ఆహారపు అలవాట్లు, పని అన్నీ మారిపోయి మనం ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల భారిన పడటం వలన ఇన్ని రోజులు గుండెపోటు మరణాలు సంభవించేవి. అయితే ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారికే ఎక్కువగా గుండెపోటు సంభవించడానికి గల కారణాలను డాక్టర్ కిరణ్ వివరించారు. యువతలో అనారోగ్యాలకు గుండె ఆరోగ్యం మీద చూపే ప్రభావాలలో మొదటిది ఫోన్ వాడకం.

గంటలు గంటలు ఫోన్లను చూస్తూ చేతులు కాళ్ళు కదల్చకుండా ఉంచడం వల్ల చాలా శరీర భాగలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అపుడు రక్తం సరఫరా చేయడానికి గుండె మరింత బలంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల గుండె మీద భారం అధికమై చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇక బరువు ఉన్నట్టుండి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురావుతున్నాయని తెలిపారు. ఇక కరోనా వాక్సిన్ వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనేది అపోహ మాత్రమే, ఆ వాక్సిన్లు వేయించుకున్నందుకే మనం బ్రతికి ఉన్నాం అంటూ తెలిపారు.

Doctor Krishna Prabhakar : వణికిస్తున్న కొత్త వైరస్ H3N2… జ్వరంతో పాటు లక్షణాలు ఇవే… చికిత్స ఏంటంటే…: డాక్టర్ కృష్ణ ప్రభాకర్

Doctor Krishna Prabhakar : కరోనా మహమ్మారిని మరచిపోకముందే మరో వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతూ జనాలు ఆసుపత్రి పాలవుతున్నారు. కరోనా వైరస్ చేసిన గాయం వల్ల ఏ చిన్నపాటి జ్వరం వచ్చినా వణికిపోతున్న ప్రజలు ప్రస్తుతం వస్తున్న వైరల్ జ్వరాల మీద అవగాహనా పెంచుకోవడం అవసరమంటూ డాక్టర్ కృష్ణ ప్రభాకర్ చెబుతున్నారు. అసలు కొత్తగా వస్తున్న ఈ H3N2 వైరస్ ఏమిటి, వ్యాధి లక్షణాలు, తీవ్రత అలాగే చికిత్స మందుల గురించి వివరించారు.

కామన్ ఫ్లూ లాంటిదే కానీ నిర్లక్ష్యం తగదు…

డాక్టర్ కృష్ణ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న జ్వరాలు గతంలో వచ్చిన H1N1 సబ్ వేరియంట్ వే అంటూ చెప్పారు. ఇన్ఫ్లుయెంజ వైరస్ లో పదిరకాల వేరియంట్లు ఉండగా అందులో ఇది ఒకటని తెలిపారు. వీటి కామన్ లక్షణాలు జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు అలసట జ్వరం అంటూ చెప్పారు. జ్వరం ఎక్కువగా ఉండి పనిచేసినా చేయకపోయినా అలసట ఎక్కువగా ఉండటం ప్రధాన లక్షణం అంటూ చెప్పారు. సాధారణంగా జలుబు ఎలా వ్యాపిస్తుందో అలానే ఈ వైరస్ వ్యాప్తి కూడా జరుగుతుందని, కాబట్టి జనం అప్రమత్తం ఉండి మాస్క్ లు ధరించడం వంటివి చేయాలని సూచించారు.

ఇక వీరికి ప్రత్యేకమైన మందులు ఏమీ లేవని కాకపోతే జలుబు, దగ్గు తగ్గేవరకు వాటికి సూచించిన మందులు అలాగే జ్వరం తగ్గే వరకు వాటికి సూచించిన మందులు వాడాలని యాంటీ బయాటిక్ మందులు వాడల్సిన పనిలేదని తెలిపారు. ఈ వైరస్ ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే వృద్దులలో ఎక్కువగా సోకుతుందని చెప్పారు. ఇక షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని, వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నవాళ్ళలో ఈ వైరస్ తగ్గిపోతుంది కానీ అలా లేని వారిలో ప్రభావం చూపుతుందని తెలిపారు.

Nutritionist doctor Sujatha: యువతలో గుండెపోటుకు కారణాలు ఇవే… రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..: న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత

Nutritionist Doctor Sujatha : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండెపోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్తవయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే అంశాల గురించి న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత వివరించారు.

జంక్ ఫుడ్ పెద్ధ విరోధి…

డాక్టర్ సుజాత ప్రస్తుతం మారుతున్న జీవన సరళి వల్ల గుండె సంబంధిత వ్యాధులు చిన్న వయసు వారికే వస్తున్నాయని తెలిపారు. ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం, స్మార్ట్ ఫోన్ అధికంగా వాడటం అలాగే జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే ప్రజలు పండ్లు, కూరగాయల వాడకం తగ్గించారు. చిన్న వయసులో గుండె సంబంధిత వ్యాధులకు ఆహారపు అలవాట్లు అసలు కారణం అంటూ చెప్పారు.

మిల్లెట్స్, బ్రౌన్ రైస్ వంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. అలాగే అన్ని రకాల పండ్లు కూరగాయలు కూడా అలవాటు చేసుకోవాలి. నిజానికి గుండెకు మంచి చేసే సాచురేటెడ్ కొవ్వులు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. కానీ ప్రస్తుతం చెడు కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాల వాడకం అధికంగా ఉంది. ఇక ఆల్కహాల్ అలాగే ధూమపానం వంటివి కూడా గుండెకు చేటు చేస్తాయి అంటూ చెప్పారు. ఇక స్ట్రెస్ గుండె జబ్బులకు ప్రధాన కారణం అంటూ చెప్పారు.

Tarakaratna: హాస్పిటల్ బెడ్ పై తారకరత్న…. వైరల్ అవుతున్న ఫోటో!

Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంపై ప్రతి ఒక్కరు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయన యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలపడం కోసం కుప్పం వచ్చారు. అయితే పాదయాత్రలో భాగంగా తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలియగానే వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు.

ప్రస్తుతం తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.ప్రత్యేక వైద్య నిపుణుల సమక్షంలో ఈయనకు చికిత్స జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు వైద్యులు తారకరత్న ఆరోగ్య విషయం గురించి వెల్లడిస్తున్నారు.ప్రస్తుతం ఈయన వెంటిలేటర్ పైనే ఉన్నారని అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగవుతుందని వైద్యులు ప్రకటించారు.

ఇలా తారకరత్న ఆరోగ్యం కుదుటపడటంతో అభిమానులు సినీ సెలెబ్రిటీలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఇప్పటికే నందమూరి నారా కుటుంబ సభ్యులందరూ కూడా నారాయణ హృదయాలయకు చేరుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు హాస్పిటల్లో తారకరత్న ఉన్నప్పటికీ ఆయనని చూడటం కోసం ఎవరిని అనుమతించలేదని తెలుస్తుంది.

Tarakaratna: కోలుకుంటున్న తారకరత్న


తాజాగా ఆసుపత్రి బెడ్ పై తారకరత్న ఉన్నటువంటి ఫోటో లీక్ అవ్వడంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో తారకరత్నకు ఆక్సిజన్ సహాయంతోనే శ్వాస అందిస్తున్నారని తెలుస్తుంది.అయితే ఇలా మొదటిసారి తారకరత్న ఫోటో వైరల్ కావడంతో అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు కూడా ప్రకటించడంతో మరే ప్రమాదం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక తారకరత్న విషయంలో మెగాస్టార్ స్పందిస్తూ ఆయన కోరుకుంటున్నారనే విషయం తనకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు.

Samantha: ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న సమంత..? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సామ్ !

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం పాటు కొనసాగాలంటే టాలెంట్ తో పాటు అందం కూడా ఎంతో ముఖ్యం. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనుగడ సాగించడానికి తమ అందాన్ని కాపాడుకోవడానికి ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి సమంత సైతం తాజాగా సర్జరీ చేయించుకుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని అందుకే ఆమె సర్జరీ కోసం అమెరికా వెళుతుంది అంటే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని తన మేనేజర్ కొట్టి పారేశారు.

ఇలా చాలా కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి సమంతా తాజాగా డాగ్స్ ఫుడ్ సంస్థకు సంబంధించిన యాడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ యాడ్ లో నటించిన సమంతను చూసి ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. అసలు సమంత ఏంటి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా సమంత రూపురేఖలు మారిపోవడంతో ఎంతోమంది ఈమె సర్జరీ చేయించుకుందని భావిస్తున్నారు.

Samantha: పెదాలకు సర్జరీ..


ఇలా గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి సమంతా అమెరికాలో తన పెదాలకు సర్జరీ చేయించుకుందని. దీంతో తన ముఖ కవళికలు మొత్తం మారిపోయాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇలా సర్జరీ చేయించుకోవడం వల్ల సమంత చూడటానికి చాలా చండాలంగా కనిపిస్తున్నారంటూ అభిమానులు సైతం ఆమె విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే సమంత సర్జరీ చేయించుకున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Health Tips: సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

Health Tips: ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. స్కూలుకెళ్లే పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ లో ఫోన్ వాడుతుంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరికి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పటంలో సందేహం లేదు. ఐతే చాలామంది నిద్రపోయే సమయంలో కూడా సెల్ ఫోన్లు దిండు కింద పెట్టుకొని మరి నిద్రపోతున్నారు. ఇలాంటి అలవాటు ఉన్న వారు ప్రమాదంలో పడినట్టే.

Health Tips: సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజు తలకింద సెల్ ఫోన్ పెట్టుకొని పడుకోవడం వల్ల దాని రేడియేషన్ కి క్యాన్సర్, ట్యూమర్స్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

రాత్రివేళ నిద్రించే సమయంలో మెదడులో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి అవటం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. ఒకవేళ నిద్రపోయే సమయంలో లో సెల్ ఫోన్ తలక్రింద పెట్టుకొని పడుకోవడం వల్ల సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ కి ఈ హార్మోన్ విడుదల అవ్వదు. అందువల్ల నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడతారు.

మెదడుపై అధిక ప్రభావం చూపుతుంది…

సెల్ ఫోన్ తల కింద పెట్టుకొని పడుకోవడం వల్ల దాని నుండి వచ్చే రేడియేషన్ మన మన మెదడు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. తద్వారా నిద్రలేమి సమస్యలు మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు నిద్ర పోయే సమయంలో వారి దరిదాపుల్లో కూడా సెల్ఫోన్ ఉండకుండా చూడాలి.

Health Tips: మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

Health Tips: సాధారణంగా నాన్ వెజ్ ఇష్టపడనివారు మష్రూమ్స్ తినటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మష్రూమ్స్ లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు దాగివున్నాయి. మష్రూమ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి రోగాల బారి నుండి మనల్ని కాపాడతాయి. ప్రస్తుత కాలంలో మష్రూమ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైన ఆహార పదార్థాలు అయినా మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా అమితంగా తీసుకోవటంవల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Tips: మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

మష్రూమ్స్ బాగా ఇష్టపడే వారు ఎక్కువ మోతాదులో వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల పుట్టగొడుగులు లభిస్తున్నాయి. వాటిలో చాలా రకాల పుట్టగొడుగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అటువంటి వాటిని తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారికి మష్రూమ్స్ ఎక్కువగా తినటం వల్ల అజీర్తి కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

Health Tips: మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడే వారు మష్రూమ్ తక్కువగా తీసుకోవటం శ్రేయస్కరం.
చాలామంది అలర్జీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మష్రూమ్ ఎక్కువగా తినటం వల్ల చర్మం పై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కొంతమందికి మష్రూమ్ తిన్న తర్వాత నీరసంగా అనిపిస్తుంది. అటువంటి వారు మష్రూమ్స్ తీసుకోకపోవడమే మంచిది.

గర్భవతులు దూరంగా ఉండటం మంచిది….


ముఖ్యంగా గర్భవతిగా ఉన్న వారు మష్రూమ్స్ తినకపోవడం శ్రేయస్కరం. ప్రస్తుత కాలంలో మష్రూమ్స్ ని కూడా నాచురల్ పద్ధతిలో కాకుండా అనేక రకాల రసాయనాలను ఉపయోగించి పండిస్తున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో మష్రూమ్ ఎక్కువగా తినటం వల్ల అవి తల్లి బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి.

Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!

Health Tips: ఈ మధ్యకాలంలో అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్యలలో నోటికి సంబంధించిన సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. దంతాల నొప్పి,నోటి దుర్వాసన వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి పరిష్కారానికి డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కొంతమందికి ఎటువంటి ఫలితం లేకుండా పోతోంది. వేలకు వేలు ఖర్చు చేసి డాక్టర్ని సంప్రదించటం కంటే మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాల ద్వారా నోటి దుర్వాసన సమస్య చెక్ పెట్టవచ్చు. ఆ పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!

సాధారణంగా మనిషి రోజుకు ఏడు నుండి ఎనిమిది లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. కానీ అతి తక్కువ మంది సరైన మోతాదులో నీటిని తీసుకుంటున్నారు. నీటిని తక్కువగా తీసుకునే వారిలో నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నోటి దుర్వాసన సమస్య తో బాధపడేవారు నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగటం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగిపోయి నోటి దుర్వాసన సమస్య నుండి విముక్తి లభిస్తుంది.

Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!

మనం ఇంట్లో లవంగాలు ఖచ్చితంగా ఉంటాయి. లవంగాల ని వంటలలో రుచికోసం వినియోగిస్తూ ఉంటారు. ఇది ఆహారాన్ని రుచిగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. లవంగాలను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. నోట్లో లవంగాలను వేసుకొని నమలటం వల్ల వాటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటి లోపల ఉన్న బ్యాక్టీరియాను తొలగించి నోటి దుర్వాసన నుండి విముక్తి కలిగిస్తాయి.

రక్తస్రావం సమస్యలు తగ్గుతాయి…

తేనేలోఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారు దాల్చిన చెక్క పొడి చేసి అందులో కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని నోటిలో రాసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇలా చేయటం వల్ల పంటి నొప్పి, చిగుళ్ళ నుండి రక్తస్రావం వంటి సమస్యలు కూడా అరికట్టవచ్చు.