General News

గర్భిణిలకు వ్యాక్సినేషన్ పై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం!

ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐదు సంవత్సరాలలోపు పిల్లలున్న తల్లులకు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు టీకాలు వేయించుకోవటం పై కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

చాలా మంది గర్భిణీ స్త్రీలు టీకాలు వేయించుకోవటం వల్ల ఏదో ప్రమాదం జరగబోతుందనే అపోహలో ఉంటారు. వారిలో ఉన్న అపోహలను తొలగించి ప్రయోజనాలను వివరించాలని ఫ్రంట్లైన్ వర్కర్స్ కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలకు కరోనా సోకిన ఏ ఒక్కరు కూడా ఆస్పత్రి పాలవకుండా కరోనా నుంచి బయటపడినట్లు పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

కేవలం కొందరిలో మాత్రమే కరోనా సోకడం వల్ల దాని ప్రభావం గర్భస్థ పిండం పై పడిందని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలు ఎవరూ కూడా కరోనా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటిన గర్భిణీ స్త్రీలలో షుగర్, ఒబిసిటీ వంటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇలాంటి వారికి మరింత ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గతంలో తల్లులకు కరోనా సోకిన కూడా 95 శాతం పిల్లలు సురక్షితంగా ఉన్నారు. అందుకోసమే గర్భిణీ స్త్రీలు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాలలో పేర్కొన్నారు.ప్రసవానికి ముందు కరోనా సోకితే ప్రసవం తర్వాత తప్పకుండా మహిళలు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

3 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

22 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

22 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago