Chaitanya Jonnalagadda : మెగాస్టార్ చిరంజీవి కష్టపడి పైకి వచ్చిన హీరో. టాలీవుడ్ లో ఎంతో మంది నేటితరం నటీ నటులకు స్ఫూర్తి. అలాంటి చిరంజీవి ఇంటినుండి వారసులుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ఒక రకంగా మెగా ఫ్యామిలీ టాలీవుడ్ కి హీరోలను అందిస్తూనే ఉంది అనొచ్చు. చిరంజీవి తరువాత తమ్ముడు నాగబాబు, ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో అడుగుపెట్టారు. నాగబాబు సంగతి పక్కన పెడితే పవన్ సంగతి చెప్పకర్లేదు. చిరంజీవి స్టార్ డమ్ తో వచ్చినా తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ తో పవన్ కళ్యాణ్ హీరో గా ఉన్నారు. ఇక ఆ తరువాత చిరంజీవి అల్లుడు అల్లు అర్జున్ హీరోగా వచ్చాడు. బన్నీ కూడా మెగా కాంపౌండ్ నుండి వచ్చినా సొంత ఇమేజ్ తో దూసుకెళ్తున్నాడు.
నాగబాబు అల్లుడు హీరో గా ఎంట్రీ…
ఇక చిరంజీవి కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, చరణ్ తన డాన్స్, నటనతో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా విభిన్నమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిరు మేనల్లుళ్ళు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు కూడా హీరోలుగా సినిమాలు తీస్తూ కెరీర్ లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక చిరు కూతురు శ్రీజ రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక వీళ్లంతా ఒక ఎత్తు అయితే నాగబాబు కూతురు నిహారిక కూడా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
కొన్ని సినిమాలు తీసినా అవి పెద్దగా ఆడకపోవడంతో ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే ఇపుడు ఆమె భర్త హీరోగా వస్తాడు అంటూ రూమర్స్ వస్తున్నాయి. హీరో గా ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండి చూడ్డానికి చక్కగా ఉండే చైతన్య కూడా హీరోగా బాగుంటాడు. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే చైతూ భార్య నిహారిక తో కలిసి వెబ్ సిరీస్ ల నిర్మాణం లో భాగస్వామ్యం అయ్యాడు. దీంతో అందరూ త్వరలో చైతన్య హీరోగా వస్తాడు అంటూ అనుకున్నారు. అయితే సినిమాల్లో యాక్ట్ చేయడం చైతన్య కి ఇష్టం లేదట.. తనకున్న వ్యాపార పనుల్లోనే తనకు సంతృప్తి దొరుకుతోందని సినిమా వర్గాలతో అన్నారట. దీంతో సినిమా ఎంట్రీ పై చైతన్య క్లారిటి ఇచ్చినట్లయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…