Tollywood celebrities : పేదవాడైనా, ధనికుడైనా కష్టపడేది కుటుంబం కోసం. అందునా పిల్లల కోసం కష్టపడుతారు. వారి పిలల్లు వారి కన్నా మంచి స్థాయిలో ఉండాలని భావిస్తారు. అయితే అదే కన్న బిడ్డ వారి కళ్ళముందే జీవితాన్ని ముగిస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. సామాన్యులనే కాదు సెలబ్రిటీలకూ కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయిన వారి కన్న బిడ్డల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నవారు ఉన్నారు.
ఎన్టీఆర్ నుండి కృష్ణ దాకా బిడ్డల్ని కోల్పోయిన వారు…
నందమూరి తారక రామారావు టాలీవుడ్ కి యుగ పురుషుడు. తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన ఆయనకు ఏడుగురు మగసంతానం. అందులో పెద్దవాడు రామ కృష్ణ చాలా చిన్న వయసులోనే మరణించారు. ఈ మరణం రామారావు గారిని బాగా కృంగదీసింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు రమేష్ బాబు కూడా ఈ మధ్యనే అనారోగ్యంతో మరణించారు. వృద్దాప్యంలో ఉన్న కృష్ణ, ఇందిర దంపతులకు రమేష్ బాబు మరణం తీరని లోటు. ఇక సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు అంటే తెలియని వారు ఉండరు. అటు విలన్ గా ఇటు కమెడియన్ గా, అటు సహాయం నటుడుగా చెరగని ముద్ర వేసిన కోటా గారి కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకు మరణం కోటా శ్రీనివాస రావు ను బాగా కృంగ దీసింది. ఇక ఆయన సహచర నటుడు బాబు మోహన్ తనయుడు పవన్ కూడా అలానే రోడ్డు ప్రమాదంలో మరణించడం యాద్రుచికం. కానీ పవన్ మరణం బాబు మోహన్ ని డిప్రెషన్ లోకి నెట్టింది. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా చిన్నవయసులోనే తన కొడుకును కోల్పోయారు. ఇక డాన్స్ మాస్టర్, నటుడు, డైరెక్టర్ అయిన ఇండియన్ మైకేల్ జక్సన్ ప్రభుదేవా కూడా తన కొడుకును కోల్పోయారు. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలను వల్ల ప్రభుదేవా కొడుకు మరణించాడు. రామారావు గారి తనయుడు హరికృష్ణ తన పెద్ద కుమారుడు జానకి రామ్ ను కూడా యాక్సిడెంట్ లో కోల్పోయారు. ఆ తరువాత కొంతకాలానికి హరికృష్ణ గారు కూడా ఆక్సిడెంటంలోనే మరణించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…