Chandaka Govindh : ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగా అంతవరకు తన సహచర నావి ఉద్యోగులతో సరదాగా ఉన్న నావి కమాండర్ చందక గోవింద్ మరణించి కుటుంబానికి తీరని లోటును మిగిల్చారు. చీపురుపల్లికి చెందిన నావి కమాండర్ చందక గోవింద్ ప్యారాచూట్ ట్రైనింగ్ లో ఆక్సిడెంట్ లో మరణించారు. విజయనగరం జిల్లా పర్ల గ్రామానికి చెందిన గోవింద్ నావి ఆఫీసర్ గా విశాఖ నావి లో సేవలందిస్తున్నారు. అందులో భాగంగానే ప్యారాచూట్ సహాయంతో ఎగిరే శిక్షణ అందుకుంటున్న ఆయన ప్యారాచూట్ సకాలంలో ఓపన్ అవ్వకపోవడం వల్ల పై నుండి కిందపడి బలమైన గాయాలు తగిలి మరణించారు.
సెకండ్ స్టేజి లో జరిగిన ప్రమాదం…
గోవింద్ గారితో మరికొంతమంది సహచర నావి ఉద్యోగులు హెలికాప్టర్ సహాయంతో గాలిలోకి దూకి ఒకరినొకరు చేతులతో పట్టుకుని గాలిలో ఉన్నారు. మొదటి స్టేజి వరకూ అంతా బాగానే ఉన్నా రెండో స్టేజిలో చందక గోవింద్ చేయి పట్టుకుని ఉన్న సహచర ఉద్యోగి తన చేయి వదిలేసాక గోవింద్ తన ప్యారాచూట్ సహాయంతో కిందకి దిగాల్సి ఉండగా అది ఓపెన్ కాకపోవడంతో అందరూ చూస్తుండగానే గోవింద్ చాలా ఫాస్ట్ గా నేల మీదకు పడిపోయారు. ఎత్తు నుండి నేల మీదకు పడటం వల్ల గోవింద్ కి తీవ్ర గాయలు అయ్యాయి.
ఈ సంఘటన కోల్కత్తా సమీపంలో జరుగగా ప్రమాదం జరిగిన వెంటనే గోవింద్ ను బరజోరా ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. విషయం తెలిసాక పర్ల గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఇక గోవింద్ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. నేడు సాయంత్రం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి మృత దేహాన్ని సొంతూరుకి తరలించనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నేవీ విడుదల చేసింది. అలాగే ఈ ఘటన మీద దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…