Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!
Rajamouli: పుష్ఫ ఇచ్చిన సక్సెస్ తో జోష్ మీదున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. అభిమానుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా… కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా దూసుకుపోతోంది. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా సినిమా హిందీ, తమిళ్ లో కూడా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.
అయితే ఇప్పుడు పుష్ప 2 తరువాత రామ్ చరణ్ తో తీయబోయే సనిమా ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని వార్తలు కూడా వచ్చాయి.
అయితే తాజాగా ఈసినిమా పై స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లలో భాగంగా చరణ్, సుక్కు కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై ఆసక్తికర కామెంట్లు చేశారు జక్కన్న. చరణ్ కు సుకుమార్ ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి వినిపించాడని.. కానీ నేను దాని గురించి మాట్లాడనని.. ఒక వేళ మాట్లాడితే సుకుమార్ కు గుండె పోటు వస్తుందని అన్నాడు.
అయితే చరణ్ కు చెప్పిన ఈ ఒక్కసీన్ చాలా కష్టమైందని.. అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. సుకుమార్, చరణ్ కాంబినేషన్ లో సినిమా ఉందని చెప్పకనే చెప్పాడు జక్కన్న. దీంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొన్న అల్లు అర్జున్.. తాజాగా రాజమౌళి ఈ సినిమాపై కామెంట్లు చేయడంతో రాబోతున్న ఈసినిమా ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. కాగా ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో, కియారా అధ్వానీ జోడీగా చరణ్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరోవైపు పుష్ప 2 షూటింగ్ కూడా త్వరలో జరుగబోతోందని తెలుస్తోంది. ఈరెండు ముగిసిన తర్వాతే వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ఉండవచ్చని తెలుస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…