Rajamouli: పుష్ఫ ఇచ్చిన సక్సెస్ తో జోష్ మీదున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. అభిమానుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా… కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా దూసుకుపోతోంది. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా సినిమా హిందీ, తమిళ్ లో కూడా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.

అయితే ఇప్పుడు పుష్ప 2 తరువాత రామ్ చరణ్ తో తీయబోయే సనిమా ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా ఈసినిమా పై స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లలో భాగంగా చరణ్, సుక్కు కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై ఆసక్తికర కామెంట్లు చేశారు జక్కన్న. చరణ్ కు సుకుమార్ ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి వినిపించాడని.. కానీ నేను దాని గురించి మాట్లాడనని.. ఒక వేళ మాట్లాడితే సుకుమార్ కు గుండె పోటు వస్తుందని అన్నాడు.
ఆ ఒక్క సీన్ ఎంతో కష్టమైంది.. రాజమౌళి:
అయితే చరణ్ కు చెప్పిన ఈ ఒక్కసీన్ చాలా కష్టమైందని.. అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. సుకుమార్, చరణ్ కాంబినేషన్ లో సినిమా ఉందని చెప్పకనే చెప్పాడు జక్కన్న. దీంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొన్న అల్లు అర్జున్.. తాజాగా రాజమౌళి ఈ సినిమాపై కామెంట్లు చేయడంతో రాబోతున్న ఈసినిమా ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. కాగా ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో, కియారా అధ్వానీ జోడీగా చరణ్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరోవైపు పుష్ప 2 షూటింగ్ కూడా త్వరలో జరుగబోతోందని తెలుస్తోంది. ఈరెండు ముగిసిన తర్వాతే వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ఉండవచ్చని తెలుస్తోంది.
































