Charmi Kaur: చార్మికౌర్ పరిచయం అవసరం లేని పేరు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పి తెర వెనుక నిర్మాతగా మారి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్ అనే బ్యానర్స్ స్థాపించారు.
ఈ బ్యానర్ నుంచి పలు సినిమాలను నిర్మిస్తున్నటువంటి ఛార్మి తాజాగా లైజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఛార్మి, పూరిలకు ఈ సినిమా బెడిసి కొట్టిందని చెప్పాలి. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి కనెక్ట్స్ మూత పడిపోతుందని,ఇక ఈ సినిమాకు కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పెట్టుబడి పెట్టారంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ఎన్నో రూమర్లు వచ్చాయి.
ఇక ఈ సినిమా నష్టాలతో పూరి జగన్నాథ్ ఏకంగా ముంబై వదిలి హైదరాబాద్ తిరిగి వస్తున్నారని ముంబైలో తన ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారంటూ ఏవేవో వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ రూమర్లపై స్పందించిన చార్మి రూమర్స్ రూమర్స్ రూమర్స్.. తమ పూరి కనెక్ట్స్(PC) గురించి వచ్చే ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమే RIP రూమర్స్ అంటూ పోస్ట్ చేశారు.
ఈ విధంగా చార్మి తమ గురించి వస్తున్నటువంటి వార్తలన్నీ పూర్తిగా ఆవాస్తవమని తిరిగి PC బ్యానర్ ప్రకటించిన సినిమాల పై దృష్టి పెట్టిందని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మరి తమ బ్యానర్ లో ప్రకటించినటువంటి జనగణమన సినిమా కూడా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. మరి చార్మి ఈ ట్వీట్ తో ఆ వార్తలకు కూడా చెక్ పెట్టి త్వరలోనే ఆ సినిమా షూటింగ్ కూడా తిరిగి ప్రారంభమవుతుందని చెప్పకనే చెప్పారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…