Child complaint in police station : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వల్ల ఎంతోమంది చిన్నారుల ఆకలి తీరుతుంది. ప్రభుత్వం సక్రమంగా రేషన్ విడుదల చేస్తున్న మద్యాహ్న భోజన పథకం అమలులో మాత్రం అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం పెట్టే అన్నం లో పురుగులు ఉంటున్నాయి అంటూ ఒక తోమ్మిదేళ్ల పాప పోలీస్ స్టేషన్ కి పోయి ధైర్యంగా కంప్లెయింట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అన్నం లో పురుగులు…. అడిగితే తిట్లు….
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, మీర్ పేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న తొమ్మిది ఏళ్ళ చిన్నారి పూజిత రోజు అక్కడే మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం తింటుంది. అయితే అన్నంలో పురుగులు రావడం కూరలు కూడా సరిగా లేకపోవడంతో అక్కడ తినడం మానేసి ఇంట్లో తినేది. అయితే అక్కడ అభోజనం చేయకపోతే టీచర్స్ తిట్టేవారట.
అన్నం లో పురుగులు వస్తున్నాయని చెప్పినా స్కూల్ హెడ్ మాస్టర్ పట్టించుకోకపోవడంతో తన తల్లిని తీసుకుని పోలీస్ స్టేషన్ లో నేరుగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వికరించిన పోలీసులు పాఠశాలలో తనిఖీ చేసి బియ్యం, కూరలు పరిశీలించి శాంపిల్స్ తీసుకెళ్లారు. ఎంతో నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన పూజిత అసలు ఎలా నీకు ఆలోచన వచ్చిందని అడిగితే మనకు ఏదైనా సమస్య వస్తే పోలీసులు పరిష్కరిస్తారని తెలుసంటూ సమాధానము ఇచ్చింది.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…