ప్రస్తుత కాలంలో ఎప్పుడు.. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇలా జరుగుతుందని వాళ్లు ఊహించి ఉండరు కదా.. ఇలా ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటిదే ఒకటి చైనాలో జరిగింది. అదేంటంటే..
చైనా కు చెందిన లారీ చెన్ పాఠశాలలో రిటైర్డ్ టీచర్. అతడు ఆరు నెలల క్రితం అత్యంత ధనవంతులో ఒకరిగా నిలిచాడు. అయితే చైనా ప్రభుత్వం విద్యా రంగంపై విధించిన కఠిన నిబంధనల కారణంగా తన బిలియనీర్ హోదాను కోల్పోయాడు. ఇతడు గ్వోటు టెచెడు ఇంక్ వ్యవస్థాపకుడ, చైర్మన్ మరియు ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేస్తున్నాడు.
చైనా ప్రభుత్వం నిర్ణయాలకు తన ఆస్తి ఇప్పుడు 15 బిలియన్(రూ.11,15,27,85,00,000.00) డాలర్లు నుంచి రూ.2,498 కోట్లకు పడిపోయింది. అంతే కాకుండా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. తన ఆన్ లైన్-ట్యూటరింగ్ సంస్థ షేర్లు కూడా న్యూయార్క్ ట్రేడింగ్ లో దాదాపు మూడింట రెండు వంతులు పడిపోయాయి. అయినా అతడు ఏ మాత్రం భయపడలేదు.. నిరాశకు గురికాలేదు. ఏది ఏమైనా గావోటు నిబంధనలను పాటిస్తుంది, సామాజిక బాధ్యతలను నెరవేరుస్తుందని చెన్ చైనీస్ సోషల్ మీడియా వీబోలో తెలిపారు.
ఈ అనుభవం కేవలం చెన్ ఒక్కరికే జరగలేదు.. న్యూయార్క్ లో కంపెనీ షేర్లు 71% పడిపోవడంతో తాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీఈఓ జాంగ్ బాంగ్సిన్ సంపద 2.5 బిలియన్ డాలర్లు నుంచి 1.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతే కాకుండా మరో బిలియనీర్ న్యూ ఓరియంటల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఇంక్ ఛైర్మన్ యు మిన్హాంగ్ కూడా తన బిలియనీర్ హోదా ను కోల్పోయాడు. ఎడ్యుకేషన్ పై తీసుకున్న నిర్ణయాలతో పలు బిలియనీర్లు ఇప్పుడు తమ హోదాలను కోల్పోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…