Chiranjeevi: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో కష్టపడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ ఈయన యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా ఒక్కో సినిమాకు దాదాపు 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈయన సంపాదన మొత్తం ఫిలింనగర్ చుట్టూ భారీగా ఆస్తులను కొనుగోలు చేశారని సమాచారం.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్న ఈ ప్రాపర్టీస్ ప్రస్తుతం కొన్ని వందల కోట్లు విలువ చేస్తున్నాయని తెలుస్తోంది. ఇలా వందల, వేలకోట్ల ఆస్తిపాస్తులు సంపాదించిన చిరంజీవి తాజాగా ఓ ఖరీదైన ప్రాపర్టీని అమ్మినట్టు సమాచారం.
ఫిలింనగర్లోని మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి ఈయన ఓ ఖరీదైన ఫ్లాట్ ను అమ్మారనీ తెలుస్తోంది. అయితే చిరంజీవి ఈ ఆస్తిను అమ్ముకోవడానికి గల కారణం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే చిరంజీవి ఈ ఫ్లాట్ అమ్మడం తనకి ఇష్టం లేకపోయినా ఒక దినపత్రిక యజమాని ఈ ఫ్లాట్ తనకు విక్రయించాలని చిరంజీవి గారిపై ఒత్తిడి తేవడంతోనే ఆయన అమ్మినట్టు తెలుస్తోంది.
ఈ స్థలంలో అయితే దినపత్రిక కార్యాలయం నిర్మించడానికి చాలా అనుకూలంగా ఉందన్న ఉద్దేశంతో ఆ యజమాని చిరంజీవిపై ఒత్తిడి తీసుకురావడంతోనే మెగాస్టార్ ఖరీదైన ప్రాపర్టీని అమ్మినట్లు తెలుస్తోంది. అయితే ఈయన ఆ ఫ్లాట్ అప్పట్లో 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారట. అయితే ప్రస్తుతం దానిని కాస్త అటు ఇటుగా 70 కోట్లకు పైగా అమ్మినట్టు వార్తలు వస్తున్నాయి. మరి చిరంజీవి ప్రాపర్టీ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…