ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలలో భారత దేశానికి మొట్టమొదటి రజత పతకాన్ని సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పై దేశ ప్రజలందరూ ఎన్నో ప్రశంసలు కురిపించారు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం తనకు కలదని ఎన్నో సందర్భాలలో మీరాబాయి నిరూపించుకున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈమె క్రీడలలో తన సత్తాను చాటి భారత దేశ ప్రతిష్టను నిలబెట్టిందని చెప్పవచ్చు.
ఈ విధంగా ఈమె సాధించిన విజయం పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించి ద్వారా ఆమెపై ప్రశంసలు కురిపించారు.టోక్యో ఒలంపిక్స్ క్రీడలలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఎంతో బిజీగా ఉన్నారు. ఈక్రమంలోనే ప్రతిరోజూఆమె ఇంటి నుంచి శిక్షణ కేంద్రానికి వెళ్లడానికి ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన పలువురు లారీ, ట్రాక్ డ్రైవర్లను వెతికే పనిలో పడ్డారు.
మన గ్రామం నుంచి సుమారు పాతిక మైళ్ళ దూరంలో ఉన్న శిక్షణ కేంద్రానికి ప్రతిరోజు ఆమెకు లిఫ్ట్ ఇచ్చి శిక్షణ కేంద్రానికి తీసుకు వెళ్లేవారు.ఈ క్రమంలోనే వారందరిని వెతికి తన ఇంటికి ఆహ్వానించి సుమారు 150 మందికి భోజనాలు పెట్టి, వారికి కొత్త బట్టలు ఇచ్చి వారి కాళ్ళకు నమస్కరించింది.
ఈ విధంగా తనకు సహాయం చేసిన లారీ డ్రైవర్ పట్ల మీరాబాయి సన్మానించిన తీరు పై పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… నీ మనసు బంగారం తల్లి.. అంటూ ట్విట్టర్ ద్వారా ఆమెపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…