ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలలో భారత దేశానికి మొట్టమొదటి రజత పతకాన్ని సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పై దేశ ప్రజలందరూ ఎన్నో ప్రశంసలు కురిపించారు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం తనకు కలదని ఎన్నో సందర్భాలలో మీరాబాయి నిరూపించుకున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈమె క్రీడలలో తన సత్తాను చాటి భారత దేశ ప్రతిష్టను నిలబెట్టిందని చెప్పవచ్చు.

ఈ విధంగా ఈమె సాధించిన విజయం పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించి ద్వారా ఆమెపై ప్రశంసలు కురిపించారు.టోక్యో ఒలంపిక్స్ క్రీడలలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఎంతో బిజీగా ఉన్నారు. ఈక్రమంలోనే ప్రతిరోజూఆమె ఇంటి నుంచి శిక్షణ కేంద్రానికి వెళ్లడానికి ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన పలువురు లారీ, ట్రాక్ డ్రైవర్లను వెతికే పనిలో పడ్డారు.
మన గ్రామం నుంచి సుమారు పాతిక మైళ్ళ దూరంలో ఉన్న శిక్షణ కేంద్రానికి ప్రతిరోజు ఆమెకు లిఫ్ట్ ఇచ్చి శిక్షణ కేంద్రానికి తీసుకు వెళ్లేవారు.ఈ క్రమంలోనే వారందరిని వెతికి తన ఇంటికి ఆహ్వానించి సుమారు 150 మందికి భోజనాలు పెట్టి, వారికి కొత్త బట్టలు ఇచ్చి వారి కాళ్ళకు నమస్కరించింది.
ఈ విధంగా తనకు సహాయం చేసిన లారీ డ్రైవర్ పట్ల మీరాబాయి సన్మానించిన తీరు పై పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… నీ మనసు బంగారం తల్లి.. అంటూ ట్విట్టర్ ద్వారా ఆమెపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































