Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారిపోయారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో అభిమానులు మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా అపోలో హాస్పిటల్ చేరుకొని తమ చిన్నారిని చూస్తూ మురిసిపోయారు.
ఇలా మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా రామ్ చరణ్ అక్క సుస్మిత చెల్లెలు శ్రీజ కూడా హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి తన మేనకోడలిని చూసుకున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ అల్లు అరవింద్ సతి సమేతంగా అపోలో హాస్పిటల్ కి వెళ్లి చిన్నారిని చూశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తన మనవరాలిని చూసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
రామచరణ్ ఉపాసన తమ బిడ్డని మా చేతులలోఎప్పుడు పెడతారా అని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము మాకు మనవరాలు పుట్టడం చాలా అపురూపంగా భావిస్తున్నామని తెలిపారు. ఇక తన మనవరాలు తనకు ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున జన్మించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక పాప జాతకం కూడా అద్భుతంగా ఉందని చిరంజీవి తెలిపారు.
ఇకపోతే పాప ఎవరి పోలికలతో ఉన్నారు అంటూ మీడియా ప్రతినిధి అడగడంతో చిరంజీవి సమాధానం చెబుతూ తాను పాపని రాత్రి చూసాను ఎవరి పోలికలతో ఉంది అని చెప్పడం ఇప్పుడు కాస్త కష్టంగానే ఉందని తను ఎవరి పోలికలతో ఉందో ఇప్పుడే చెప్పలేమంటూ చిరంజీవి సమాధానం చెప్పారు.ఇక అపోలో హాస్పిటల్ ముందు మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…