Movie News

Chiranjeevi: బాలకృష్ణతో రెండు పెగ్గులు వేసేవాడిని.. ఆ హీరోలతో ఉన్న అనుబంధం బయటపెట్టిన మెగాస్టార్!

Chiranjeevi: తాజాగా హర్యానా గవర్నర్ మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో జరిగిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ గతంలో స్టార్ హీరోలు అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో పోటీలు ఉండేవి.

ఒక హీరో సినిమా విడుదలై సినిమాకు సంబంధించిన పోస్టర్ గోడలకు అతికిస్తే మరొక హీరో అభిమానులు ఆ పోస్టర్ పై పేడ నీళ్లు చల్లేవారు. తద్వారా హీరోల మధ్య కూడా కాస్త అభిప్రాయ బేధాలు వచ్చేవని చిరంజీవి వెల్లడించారు.అయితే ఓకే ఇండస్ట్రీలో పనిచేసే హీరోల మధ్య ఇలాంటి మనస్పర్ధలు మంచివి కాదన్న ఉద్దేశంతో 80,90లలో హీరోలుగా కొనసాగుతున్న మేము ఇలాంటి వాతావరణం ఉండకూడదని భావించాము.

ఈ క్రమంలోనే అప్పుడు మేమంతా హీరోలుగా ఇండస్ట్రీలో ఎంతో సఖ్యతగా ఉండే వారిమని,ఒక సినిమా విడుదలై సక్సెస్ అయిన తర్వాత అందరి హీరోలను ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీలు జరుపుకునే వాళ్ళము. ఒకే వేదికపై సందడి చేసే వాళ్ళమని చిరంజీవి అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇలా అందరూ కలిసి ఒక చోట ఉండటం వల్ల హీరోల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉండేవని తెలిపారు.

Chiranjeevi: అప్పటి విషయాలను గుర్తు చేసుకున్న చిరు..

ఇకపోతే రాత్రి అయితే సీనియర్ నటులు బాలకృష్ణ నాగార్జున వంటి వారితో కలిసి ఒక రెండు పెగ్గులు కూడా వేసేవారిమని ఇలా పెగ్గులు వేసిన తర్వాత వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉండేదని అప్పటి విషయాలను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా, నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని మొక్కలు.. రోజువారీ జీవితంలో చేర్చుకుంటే ప్రయోజనాలు ఎన్నో!

ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మహిళలు ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, ఆహారపు అలవాట్ల మార్పులు…

2 minutes ago

ఇకపై AIతోనే వ్యాధులను ముందే గుర్తించే కొత్త వైద్య విప్లవం!

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా తన ముద్ర వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభమైన AI ఆధారిత…

16 minutes ago

పిజ్జా అతిగా తింటున్నారా? ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణుల హెచ్చరిక!

పిజ్జా అంటే చాలామందికి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్. రుచికరమైన చీజ్, సాస్, టాపింగ్స్‌తో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నిపుణులు…

23 minutes ago

ఒక్క చిన్న దోమ.. పెద్ద ప్రమాదం! వరల్డ్ మలేరియా డే సందేశం ఏమిటి?

ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మలేరియా డేను నిర్వహిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి మలేరియా…

29 minutes ago

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. దర్యాప్తు పూర్తి! 30న కీలక నివేదిక

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై వచ్చిన కల్తీ ఆరోపణలపై నియమించిన ఏకసభ్య కమిషన్ తన దర్యాప్తును పూర్తి…

35 minutes ago

మలేరియా, డెంగ్యూ ఒకేలా అనుకుంటున్నారా..? నిజం ఇది తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25ను ప్రపంచ మలేరియా దినోత్సవంగా పాటిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన…

2 hours ago