Chiranjeevi: తాజాగా హర్యానా గవర్నర్ మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ గతంలో స్టార్ హీరోలు అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో పోటీలు ఉండేవి.

ఒక హీరో సినిమా విడుదలై సినిమాకు సంబంధించిన పోస్టర్ గోడలకు అతికిస్తే మరొక హీరో అభిమానులు ఆ పోస్టర్ పై పేడ నీళ్లు చల్లేవారు. తద్వారా హీరోల మధ్య కూడా కాస్త అభిప్రాయ బేధాలు వచ్చేవని చిరంజీవి వెల్లడించారు.అయితే ఓకే ఇండస్ట్రీలో పనిచేసే హీరోల మధ్య ఇలాంటి మనస్పర్ధలు మంచివి కాదన్న ఉద్దేశంతో 80,90లలో హీరోలుగా కొనసాగుతున్న మేము ఇలాంటి వాతావరణం ఉండకూడదని భావించాము.
ఈ క్రమంలోనే అప్పుడు మేమంతా హీరోలుగా ఇండస్ట్రీలో ఎంతో సఖ్యతగా ఉండే వారిమని,ఒక సినిమా విడుదలై సక్సెస్ అయిన తర్వాత అందరి హీరోలను ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీలు జరుపుకునే వాళ్ళము. ఒకే వేదికపై సందడి చేసే వాళ్ళమని చిరంజీవి అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇలా అందరూ కలిసి ఒక చోట ఉండటం వల్ల హీరోల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉండేవని తెలిపారు.

Chiranjeevi: అప్పటి విషయాలను గుర్తు చేసుకున్న చిరు..
ఇకపోతే రాత్రి అయితే సీనియర్ నటులు బాలకృష్ణ నాగార్జున వంటి వారితో కలిసి ఒక రెండు పెగ్గులు కూడా వేసేవారిమని ఇలా పెగ్గులు వేసిన తర్వాత వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉండేదని అప్పటి విషయాలను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా, నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

































