ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతుంది.. రోజు రోజుకి దీని ప్రభావం మరింత పెరిగిపోతోంది.. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.సామాన్య ప్రజలకే కాదు సినీ ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు..కరోనా కారణంగా ఓవైపు కొందరి ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతుంటే మరికొందరి జీవితాలు ఉపాధి లేక ఆగమైపోతున్నాయి.
లాక్డౌన్ కారణంగా పనిలేక ఎంతో మంది తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారు. రోజు పనిచేస్తే తప్ప ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్థితి మన సమాజంలో ఎంతో మంది ఉంది. అయితే ఈ క్రమంలోనే పేద ప్రజల మేలు కోసం కొంత మంది ముందుకొస్తున్నారు. తమ వంతు సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్సర్లకు అండగా నిలిచారు. లాక్డౌన్ కారణంగా షోలు లేక ఉపాధి కోల్పోయిన డ్యాన్సర్లకు తనవంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూపు డ్యాన్సర్లు, టీవీ షోలు చేసే డ్యాన్సర్లకు ఈ సమయంలో పని దొరకడం చాలా కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. ఏదైనా టీవీ షోలు, కార్యక్రమాలు జరిగితే తప్ప వాళ్లకు పని ఉండదన్న శేఖర్ మాస్టర్.భోజనానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ కరోనా సమయంలో ఇలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పమని శేఖర్ మాస్టర్ ప్రకటించారు. అలాంటి వారికి తన టీమ్ సభ్యులు అవసరమైన సరుకులు అందిస్తారని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పుకొచ్చారు.ఇక డ్యాన్సర్లకు అండగా నిలుస్తున్న శేఖర్ మాస్టర్ కి సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..!!
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…