ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గంగిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయానా మామ. వైఎస్ జగన్ సతీమణి భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి. అయన గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఆరోగ్యం విషమించడంతో అయన నిన్న అర్ధరాత్రి (2020, అక్టోబర్ 2, శుక్రవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన పులివెందులలో పేదల వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు 2001 – 2005 లో అయన పులివెందుల ఎంపీ గా కూడా పనిచేసారు. ఈసీ గంగిరెడ్డి మరణంతో ఏపీ సీఎం జగన్ నివాసంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవలే సీఎం జగన్ తన ప్రత్యేక విమానంలో రేణిగుంట నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కకి నుంచి గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మామ ఈసీ గంగిరెడ్డిని పరామర్శించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…