ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గంగిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయానా మామ. వైఎస్ జగన్ సతీమణి భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి. అయన గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఆరోగ్యం విషమించడంతో అయన నిన్న అర్ధరాత్రి (2020, అక్టోబర్ 2, శుక్రవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన పులివెందులలో పేదల వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు 2001 – 2005 లో అయన పులివెందుల ఎంపీ గా కూడా పనిచేసారు. ఈసీ గంగిరెడ్డి మరణంతో ఏపీ సీఎం జగన్ నివాసంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవలే సీఎం జగన్ తన ప్రత్యేక విమానంలో రేణిగుంట నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కకి నుంచి గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మామ ఈసీ గంగిరెడ్డిని పరామర్శించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…