Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!
Flash News: తెలంగాణ సీఎం దళితులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని.. ప్రతీ ఏటా రెండుమూడు లక్షల మందికి దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. మార్చి తరువాత ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల మందికి దళిత బంధు ఇస్తామని వెల్లడించారు.
శరీరంలో ఏ భాగం మంచిగా లేకున్నా.. శరీరం మొత్తం బాగున్నట్లు కాదని.. దళితులు కూడా అభివ్రుద్ది చేసుకుందామని అన్నారు సీఎం కేసీఆర్. దళితబంధు పథకం చూసి చాలా మందికి కళ్లు మండుతున్నాయని ప్రతిపక్షాలను విమర్శించారు. ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని అన్నార.
దళిత బంధులో రూ. 10 లక్షలు ఇవ్వడమే కాకుండా.. మెడికల్ షాపుల్లో, ఫెర్టిలైజర్ షాపుల్లో, ప్రభుత్వ కాంట్రాక్ట్ లో, బార్, వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామని అన్నారు. ఇలా భారత దేశంలో ఏ రాష్ట్రం ఎక్కడా చేయలేదని అన్నారు.
మరోవైపు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ బోర్ల దగ్గర మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని… నన్ను చంపినా ఆ పని చేయను అని..ఏం చేసుకుంటావో చేసుకో అని మోదీకి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. బీజేపీ వాళ్లు టీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే నశం చేస్తామంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఢిల్లీ కోటలు బద్ధలు కొడతా అంటూ.. వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…