Comedian Yogi Babu:కమెడియన్ యోగి బాబు అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఈయన ఫోటో చూస్తే మాత్రం ఈయన అందరికీ పరిచయమైన విధంగానే అనిపిస్తారు. ఇలా కమెడియన్ యోగి బాబు పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
తాజాగా యోగి బాబు, నితిన్ సత్య కథానాయకులుగా, గాయత్రి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ముత్తు, భువనేశ్వరి, ఉమా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా దాదా.ఎనీ టైం మనీ ఫిలిమ్స్ పతకం పై గిన్నిస్ కిషోర్ కధ మాటలు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.
ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాకుండా యోగి బాబు అడ్డుకున్నారని నిర్మాత కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సినిమాని కొనుగోలు చేయడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు ఈయన పర్సనల్ గా ఫోన్ చేసి ఈ సినిమాలో కేవలం తాను నాలుగు సీన్లలో మాత్రమే నటించానని ఈ సినిమా కనుక కొనుక్కుంటే నష్టపోతారంటూ సినిమా గురించి చెడుగా ప్రచారం చేశారట.
ఈ విధంగా ఈయన చెడుగా ప్రచారం చేయడంతో సినిమా కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి సినిమా కొనుక్కొని చూస్తేనే కదా ఆయన నాలుగు సీన్లలో నటించారా లేఖ 40 సీన్లలో నటించారా అనేది తెలుస్తుంది అంటూ ఆవేదన చెందారు.ఇక తన తదుపరి సినిమాకి కూడా యోగిబాబు అడ్వాన్స్ తీసుకున్నారని అలాగే ఆ సినిమాలో నటించిన మొండికేస్తున్నారంటూ కిషోర్ ఆవేదన చెందారు. ఇక ఈ సినిమా కనుక విడుదల కాకపోతే తన కుటుంబం మొత్తానికి ఆత్మహత్య తప్ప వేరే ఛాన్స్ లేదంటూ కిషోర్ ఆవేదన వ్యక్తం చేయడంతో పలువురు యోగి బాబు చూడటానికి కమిడియన్ గా అనిపించిన ఇంత కంత్రి నా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…