Comedian Yogi Babu:కమెడియన్ యోగి బాబు అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఈయన ఫోటో చూస్తే మాత్రం ఈయన అందరికీ పరిచయమైన విధంగానే అనిపిస్తారు. ఇలా కమెడియన్ యోగి బాబు పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
తాజాగా యోగి బాబు, నితిన్ సత్య కథానాయకులుగా, గాయత్రి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ముత్తు, భువనేశ్వరి, ఉమా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా దాదా.ఎనీ టైం మనీ ఫిలిమ్స్ పతకం పై గిన్నిస్ కిషోర్ కధ మాటలు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.
ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాకుండా యోగి బాబు అడ్డుకున్నారని నిర్మాత కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సినిమాని కొనుగోలు చేయడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు ఈయన పర్సనల్ గా ఫోన్ చేసి ఈ సినిమాలో కేవలం తాను నాలుగు సీన్లలో మాత్రమే నటించానని ఈ సినిమా కనుక కొనుక్కుంటే నష్టపోతారంటూ సినిమా గురించి చెడుగా ప్రచారం చేశారట.
ఈ విధంగా ఈయన చెడుగా ప్రచారం చేయడంతో సినిమా కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి సినిమా కొనుక్కొని చూస్తేనే కదా ఆయన నాలుగు సీన్లలో నటించారా లేఖ 40 సీన్లలో నటించారా అనేది తెలుస్తుంది అంటూ ఆవేదన చెందారు.ఇక తన తదుపరి సినిమాకి కూడా యోగిబాబు అడ్వాన్స్ తీసుకున్నారని అలాగే ఆ సినిమాలో నటించిన మొండికేస్తున్నారంటూ కిషోర్ ఆవేదన చెందారు. ఇక ఈ సినిమా కనుక విడుదల కాకపోతే తన కుటుంబం మొత్తానికి ఆత్మహత్య తప్ప వేరే ఛాన్స్ లేదంటూ కిషోర్ ఆవేదన వ్యక్తం చేయడంతో పలువురు యోగి బాబు చూడటానికి కమిడియన్ గా అనిపించిన ఇంత కంత్రి నా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…