Kangana Ranaut: కొత్త సంవత్సరానికి పూజలతో స్వాగతం పలికిన కాంట్రవర్సి బ్యూటీ.. ఈ ఏడాదైనా లవ్ లెటర్స్ రావాలంటూ!
Kangana Ranaut: కొత్త సంవత్సరం రోజున ప్రతి ఒక్కరూ కుంటుంబంతో కలిసి పార్టీలు చేసుకుంటారు. కానీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పూజలు చేస్తూ కనిపించింది. బాలీవుడ్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ శనివారం నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని.. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించి పీఠాధిపతిని ఆరాధించారు.
తెలుగు సినీ నటుడు సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి ఇతర ప్రముఖులు కూడా తిరుమల ఆలయాన్ని సందర్శించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కంగనా ‘గౌ పూజ’ , రాహుకేతు పూజలు చేసింది. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆలయ ఈఓ డి పెద్దిరాజు ఆమెకు స్వాగతం పలికి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆమెకు వేదశీర్వచనం అందించి ఎమ్మెల్యే జ్ఞాపికలు.. ప్రసాదాలు అందజేశారు. కంగనాకు శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనం చేయించిన వేద పండితులు ఆ తర్వాత ఆశీర్వచనాలు ఇచ్చి ప్రసాదంను ఇచ్చి పట్టు వస్త్రాలతో సత్కరించారు.
హీరోయిన్ ఆలయానికి రావడంతో చాలామంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.దీంతో పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. ఇదిలా ఉండగా.. హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ల సమర్పణలో కూడా ఆమె పాల్గొన్నారు. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంటర్నల్ ఆపరేషన్ సిస్టమ్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ , ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ సిస్టమ్ కేటగిరీల కింద ఆలయం ఆరు ISO సర్టిఫికేట్లను పొందింది. హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రతినిధి శివయ్య హాజరై సర్టిఫికెట్లను ఆలయ అధికారులకు అందజేశారు. ఇక ఆలయంలో పూజలు చేసిన ఏమిటి ఈ ఏడాది తనపై పోలీసు కేసులు ఎక్కువగా వచ్చి.. లవ్ లెటర్స్ రావాలని పూజలు చేసినట్టు తెలియజేశారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…