Categories: FeaturedMovie News

విడాకుల వార్తలపై స్పందించిన కలర్స్ స్వాతి… హ్యారీపోటర్ మ్యాజిక్ చూపించేసిందిగా…!!

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు..తెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి… రెండేళ్ల క్రితం వికాస్ వాసు అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది కలర్స్ స్వాతి. అయితే స్వాతి, వికాస్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వారి సంసారం జీవితం సరిగా సాగడం లేదని అందువల్ల వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజగా ఆమె సోషల్ మీడియాలో తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో స్వాతి విడాకులు తీసుకుంటుందంటూ నెట్టింట గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇందుకోసం హ్యారీపోటర్ సినిమాలోని ఒక డైలాగ్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కూడా వాడేసుకుంది.

డాబి : డాబికి ఎక్కడ ఉండాలో తెలుసు.. దాన్ని కమ్ అండ్ గో రూమ్ అంటారు. లేదా రిక్వైర్మెంట్ రూమ్ అంటారు.
హ్యారీ పోటర్ : ఎందుకు ?
డాబీ : ఎందుకంటే నిజంగా అవసరం ఉన్నవారే ఆ రూమ్ లోకి అడుగుపెట్టగలరు. అయితే కొన్ని సార్లు అది ఉండొచ్చు.. కొన్ని సార్లు ఉండకపోవచ్చు. అయితే అన్వేషించిన వారి కోసం అవి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. అంటూ రాసుకొచ్చింది.

దీనితో పాటు ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. 2012 నుంచి తన ఫోటోలు ఆర్కివ్ లో దాచి పెట్టానంటూ స్క్రోల్ చేసి మరీ పాత ఫోటోలు చూపించింది. మొత్తానికి హ్యారీ పోటర్ మ్యాజిక్ చూపించి తన తాజా పోస్టుతో సోషల్ మీడియాలో తన విడాకులపై వస్తున్నా వార్తలకు చెక్ పెట్టింది. మళ్ళీ ఇటువంటి వార్తలు వస్తే ఏ సినిమా చూపిస్తాదో.. అని అనుకుంటున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

3 minutes ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

7 minutes ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

11 minutes ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

15 minutes ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

20 minutes ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

33 minutes ago