ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కరోనా కరోనా మెడికల్ కిట్లు పంపిణీ చేసారు. అయితే కేవలం మెడిసిన్ మాత్రమె పంచితే ప్రత్యేకత ఏముంది అనుకున్నారో ఏమో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సారు. ప్రతి కిట్లో మెడిసిన్ తో పాటూ లిక్కర్ సీసాలు కూడా పెట్టి పంచేశారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ గురువారం ఎమ్మెల్సీ తరఫున కరోనా మెడికల్కిట్టును ప్రజాప్రతినిధులకు పంపిణీ చేశారు.
జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులందరికీ ఈ మెడికల్ కిట్లను అందజేశారు. అయితే వీరిలో కొందరు కిట్టును పరిశీలించగా అందులో టీచర్స్ లిక్కర్ బాటిల్ కనపడటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఈ విషయంపై మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎమ్మెల్సీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఇలా లిక్కర్ బాటిల్స్ పంపడం అనేది ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఎంపీటీసీల ఫోరం లీడర్వాసుదేవురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…