తెలంగాణాలో 809 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య… ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ లో 31 కేసులు !!

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నా కూడా ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కష్టతరమవుతుంది. ఈ నేపధ్యంలో తెలంగాణాలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809కి చేరింది. తెలంగాణ మొత్తం మీద ఈ ఒక్కరోజే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ తో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. కరోనా నుండి బయటపడి ఇప్పటి వరకు 186 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 606 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. హైదరాబాద్ లో 31, గద్వాల్ 7, సిరిసిల్ల 2, రంగారెడ్డి 2, నల్గొండలో కొత్తగా 1 కేసు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఈరోజు ఎవరు డిశ్చార్ కాలేదు.. కొత్తగా మరణాలు కూడా సంభవించలేదు.

ఈ క్రమంలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జరుగుతూనే ఉందని, అందువల్ల అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. మరోవైపు హైదరాబాద్ లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రజలు ఎవరు ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పారు సీఎం కేసీఆర్.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

6 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

36 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

1 hour ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

1 hour ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

1 hour ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

1 hour ago