కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నా కూడా ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కష్టతరమవుతుంది. ఈ నేపధ్యంలో తెలంగాణాలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809కి చేరింది. తెలంగాణ మొత్తం మీద ఈ ఒక్కరోజే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ తో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. కరోనా నుండి బయటపడి ఇప్పటి వరకు 186 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 606 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. హైదరాబాద్ లో 31, గద్వాల్ 7, సిరిసిల్ల 2, రంగారెడ్డి 2, నల్గొండలో కొత్తగా 1 కేసు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఈరోజు ఎవరు డిశ్చార్ కాలేదు.. కొత్తగా మరణాలు కూడా సంభవించలేదు.
ఈ క్రమంలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జరుగుతూనే ఉందని, అందువల్ల అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. మరోవైపు హైదరాబాద్ లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రజలు ఎవరు ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పారు సీఎం కేసీఆర్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…