దేశంలో కరోనా రోజు రోజుకు పంజా విసురుతోంది. లాక్ డౌన్ అమలులో ఉన్నా.. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కష్టతరమవుతుంది. మరో వైపు భాదితులను ముందుగా గుర్తించేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అదే క్రమంలో తెలంగాణ సర్కార్ మెడికల్ షాపులపై కొన్ని ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు, జ్వరం, జలుబు అంటూ వచ్చే వారికీ ప్రిస్క్రిప్క్షన్ లేకుండా మందులు ఇవ్వొద్దని సూచించింది. ఆ మందుల వల్ల వారికి స్వల్పకాల ఉపశమనం కలుగుతుండటంతో కొందరు పరీక్షలకు ముందుకు రావడంలేదనే ఉద్దేశ్యంతో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై జలుబు, దగ్గు, జ్వరం మందులు అమ్మాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ చేసింది. మరోవైపు సాధారణ మందుల అమ్మకాలపై కూడా నియంత్రణ విధించింది. దగ్గు మందులు సైతం ప్రిస్క్రిప్షన్ లేనిదే అమ్మడానికి కుదరదని ఆదేశాలు జారీచేసారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రెటరీ.. జిహెచ్ఎంసితో పాటుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…