దేశంలో కరోనా రోజు రోజుకు పంజా విసురుతోంది. లాక్ డౌన్ అమలులో ఉన్నా.. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కష్టతరమవుతుంది. మరో వైపు భాదితులను ముందుగా గుర్తించేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అదే క్రమంలో తెలంగాణ సర్కార్ మెడికల్ షాపులపై కొన్ని ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు, జ్వరం, జలుబు అంటూ వచ్చే వారికీ ప్రిస్క్రిప్క్షన్ లేకుండా మందులు ఇవ్వొద్దని సూచించింది. ఆ మందుల వల్ల వారికి స్వల్పకాల ఉపశమనం కలుగుతుండటంతో కొందరు పరీక్షలకు ముందుకు రావడంలేదనే ఉద్దేశ్యంతో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై జలుబు, దగ్గు, జ్వరం మందులు అమ్మాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ చేసింది. మరోవైపు సాధారణ మందుల అమ్మకాలపై కూడా నియంత్రణ విధించింది. దగ్గు మందులు సైతం ప్రిస్క్రిప్షన్ లేనిదే అమ్మడానికి కుదరదని ఆదేశాలు జారీచేసారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రెటరీ.. జిహెచ్ఎంసితో పాటుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…