Health News

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పై పంజా విసురుతున్న కరోనా.. జాగ్రత్తంటున్న నిపుణులు..?

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అందరి పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ జీవనశైలి వ్యాధిగ్రస్తులు అయినటువంటి మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మూత్రపిండ వంటి తదితర సమస్యలతో బాధపడే వారిలో అధిక ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడించారు.సాధారణంగా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాధి తీవ్రత వారిలో అధికంగా ఉంటుంది.తద్వారా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడేవారు ఈ మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా అధ్యయనాల ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఊబకాయం సమస్యతో బాధపడే వారిలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని, మధుమేహంతో బాధపడేవారిలో మూడింతలు, అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారిలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఈ అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధులతో బాధపడేవారికి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరించారు.

ఈ విధమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రెండు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కొందరిలో ఎలాంటి యాంటీబాడీలు వృద్ధి చెందడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లిన మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని నిపుణులు తెలిపారు.బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ ఏ వస్తువును తాకిన శానిటైజర్ చేసుకోవడం ఎంతో ముఖ్యమని తగినన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే ఈ మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలమని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago