గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అందరి పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ జీవనశైలి వ్యాధిగ్రస్తులు అయినటువంటి మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మూత్రపిండ వంటి తదితర సమస్యలతో బాధపడే వారిలో అధిక ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడించారు.సాధారణంగా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వ్యాధి తీవ్రత వారిలో అధికంగా ఉంటుంది.తద్వారా ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడేవారు ఈ మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా అధ్యయనాల ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఊబకాయం సమస్యతో బాధపడే వారిలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని, మధుమేహంతో బాధపడేవారిలో మూడింతలు, అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారిలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఈ అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధులతో బాధపడేవారికి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరించారు.
ఈ విధమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రెండు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కొందరిలో ఎలాంటి యాంటీబాడీలు వృద్ధి చెందడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లిన మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని నిపుణులు తెలిపారు.బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ ఏ వస్తువును తాకిన శానిటైజర్ చేసుకోవడం ఎంతో ముఖ్యమని తగినన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే ఈ మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలమని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…