Featured

2025 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న ఐటీ కంపెనీలు!

కరోనా వైరస్ మన దేశంలో వ్యాపించడంతో అన్ని రంగాలకు చెందిన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించడంతో సిటీలలో ఉండే చాలా మంది ఉద్యోగులు వారి స్వస్థలాలకు చేరుకున్నారు.వీరిలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ కి చేరుకోవడంతో ఇది ఏపీకి ఎంతో అనుకూలమైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు.

ప్రముఖ ఐటీ కంపెనీలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కల్పించింది. అయితే దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవుతుందని తెలియడంతో వంద శాతం ఉద్యోగులను కంపెనీలకు రమ్మని చెప్పడానికి అన్ని కంపెనీలు సాహసించడం లేదు. అందుకోసమే అన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు 2021 మార్చి 31 వరకు వర్క్ ఫ్రొం హోమ్ వేసులబాటు కల్పించాలని నిర్ణయించారు.

ఇప్పటికే దాదాపు 98 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీలలో పనిచేసే 9 లక్షల మంది ఉద్యోగులలో దాదాపు8.75 లక్షల మంది ఇంటి నుంచి తమ విధులను నిర్వహిస్తున్నారు. అయితే
టీసీఎస్‌ మరో అడుగు ముందుకేసి ఈ వర్క్ ఫ్రమ్ హోం ను 2025 వరకు అమలు చేయాలని నిర్ణయించింది. అయితే కరోనా ప్రభావం తగ్గినా కూడా కేవలం 25 మంది ఉద్యోగులతో ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని సూచించింది.

పెద్ద పెద్ద నగరాలలో ప్రముఖ కంపెనీలు వారి ఆఫీసులను అద్దె భవనాలు తీసుకొని నిర్వర్తిస్తున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం నిర్వహించడంతో వారికి ఈ భారం తగ్గుతుండటంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కే మొగ్గు చూపుతున్నాయి.ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్న ఐటి ఉద్యోగులు ఎక్కువ శాతం మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడంతో, రాష్ట్రంలోని చిన్న పల్లెలు కూడా ఐటీ, ఇతర సేవా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయని, వర్క్ ఫ్రం హోం ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అనుకూలమని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

5 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

5 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

6 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

7 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

8 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

9 hours ago