notebook written work from home text with stationary
కరోనా వైరస్ మన దేశంలో వ్యాపించడంతో అన్ని రంగాలకు చెందిన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించడంతో సిటీలలో ఉండే చాలా మంది ఉద్యోగులు వారి స్వస్థలాలకు చేరుకున్నారు.వీరిలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ కి చేరుకోవడంతో ఇది ఏపీకి ఎంతో అనుకూలమైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు.
ప్రముఖ ఐటీ కంపెనీలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కల్పించింది. అయితే దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవుతుందని తెలియడంతో వంద శాతం ఉద్యోగులను కంపెనీలకు రమ్మని చెప్పడానికి అన్ని కంపెనీలు సాహసించడం లేదు. అందుకోసమే అన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు 2021 మార్చి 31 వరకు వర్క్ ఫ్రొం హోమ్ వేసులబాటు కల్పించాలని నిర్ణయించారు.
ఇప్పటికే దాదాపు 98 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీలలో పనిచేసే 9 లక్షల మంది ఉద్యోగులలో దాదాపు8.75 లక్షల మంది ఇంటి నుంచి తమ విధులను నిర్వహిస్తున్నారు. అయితే
టీసీఎస్ మరో అడుగు ముందుకేసి ఈ వర్క్ ఫ్రమ్ హోం ను 2025 వరకు అమలు చేయాలని నిర్ణయించింది. అయితే కరోనా ప్రభావం తగ్గినా కూడా కేవలం 25 మంది ఉద్యోగులతో ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని సూచించింది.
పెద్ద పెద్ద నగరాలలో ప్రముఖ కంపెనీలు వారి ఆఫీసులను అద్దె భవనాలు తీసుకొని నిర్వర్తిస్తున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం నిర్వహించడంతో వారికి ఈ భారం తగ్గుతుండటంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కే మొగ్గు చూపుతున్నాయి.ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్న ఐటి ఉద్యోగులు ఎక్కువ శాతం మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడంతో, రాష్ట్రంలోని చిన్న పల్లెలు కూడా ఐటీ, ఇతర సేవా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయని, వర్క్ ఫ్రం హోం ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అనుకూలమని చెప్పవచ్చు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…