దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశవ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య లక్షలలో నమోదు కాగా మరణాల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ ను మరింత వేగంగా అరికట్టడం కోసం పరిశోధకులు మరిన్ని ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో టీకా ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటం కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అయితే వ్యాక్సిన్ రూపంలో కాకుండా స్ప్రే ద్వారా కూడా ఈ మహమ్మారిని అరికట్టవచ్చని కెనడాకు చెందిన సానోటైజ్ సమస్థ సరికొత్త మందును కనిపెట్టింది. సార్స్- కోవిడ్ 19 ను ఎదుర్కోవడంలో ఈ స్ప్రే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.
కరోనా వైరస్ నోరు లేదా ముక్కు ద్వారా మన శరీరం లోపలికి ప్రవేశించి ఊపిరితిత్తులను చేరుతుంది. ఈ వైరస్ ముక్కులో నుంచి ఊపిరితిత్తులలోకి వెళ్లకుండా ముక్కు రంధ్రాలలోనే వైరస్ ను చంపే స్ప్రే ను ఇప్పటికే కెనడా దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందినట్లు తెలిపింది. ఈ స్ప్రే ద్వారా 95 శాతం వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.
ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో ఈ స్ప్రే ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే భారత భాగ్య స్వామ్యం కోసం తమ సమస్థ ఎదురు చూస్తోందని, త్వరలోనే ఈ స్ప్రే ను భారత మార్కెట్లోకి తీసుకురానుందని కెనడాకు చెందిన సానోటైజ్ సమస్థ పేర్కొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…