మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది.వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ క్రమంలోనే మే 28వ తేదీ నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది.
వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ అనగానే చాలామందిలో ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి? వ్యాక్సినేషన్ ఏ విధంగా తీసుకోవాలి అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగా మన పేరు అడ్రస్ వంటి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం selfregistration.cowin.gov.in అనే లింక్ అందుబాటులో ఉంచింది.18 సంవత్సరాలు పైబడినవారు వ్యాక్సిన్ ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి అనే విషయాలను ఇందులో నమోదు చేయాలి. ఈ లింక్ ను మీరు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా అయినా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
*మీరు గుర్తింపుకార్డులు ఇచ్చిన కార్డు పై ఉన్న పేరు నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ తరువాత వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి ఎక్కడ వేయించుకోవాలి అనే విషయాలను నమోదు చేయాలి.
*మీ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ వివరాలు అన్ని స్క్రీన్ పై కనిపిస్తాయి. అవసరమైతే ఈ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.ఓకే మొబైల్ నెంబర్ పై మీ కుటుంబంలోని నలుగురు వ్యక్తుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయానికంటే ముందుగా కేంద్రానికి చేరుకొని సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలి.
*వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఇచ్చిన గుర్తింపు కార్డులు తీసుకుని వెళ్లాలి.ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై ఎటువంటి సందేహాలు ఉన్నా హెల్ప్ లైన్ నంబర్ 1075 కి ఫోన్ చేసి మీ సందేహాలను అడగవచ్చు.
*ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…