Connect with us

Featured

కోవిడ్ – 19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి!

Published

on

మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది.వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ క్రమంలోనే మే 28వ తేదీ నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది.

Advertisement

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ అనగానే చాలామందిలో ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి? వ్యాక్సినేషన్ ఏ విధంగా తీసుకోవాలి అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగా మన పేరు అడ్రస్ వంటి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం selfregistration.cowin.gov.in అనే లింక్ అందుబాటులో ఉంచింది.18 సంవత్సరాలు పైబడినవారు వ్యాక్సిన్ ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి అనే విషయాలను ఇందులో నమోదు చేయాలి. ఈ లింక్ ను మీరు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా అయినా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

  • ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి selfregistration.cowin.gov.in అని టైప్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్ ఫేజ్ వస్తుంది.
  • రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గేట్ ఓటిపి అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేయాలి.
  • ఆ తరువాత మరో పేజ్ ఓపెన్ అయ్యి ఏదైనా గుర్తింపు కార్డు అనగా ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ,పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.

*మీరు గుర్తింపుకార్డులు ఇచ్చిన కార్డు పై ఉన్న పేరు నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ తరువాత వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి ఎక్కడ వేయించుకోవాలి అనే విషయాలను నమోదు చేయాలి.

  • పై వివరాలన్నీ నమోదు అయిన తర్వాత స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా అందులో షెడ్యూల్ అపాయింట్మెంట్ ఫర్ వ్యాక్సినేషన్ క్లిక్ చేస్తే మీ రాష్ట్రం, జిల్లా ఇతర వివరాలను నమోదు చేయాలి.
  • ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాల లిస్ట్ వస్తుంది. అందులో మీకు దగ్గరగా ఉన్న కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యాక్సిన్ తేదీ సమయాన్ని ఎంపిక చేసుకొని కన్ఫామ్ బటన్ పై క్లిక్ చేయాలి.

*మీ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ వివరాలు అన్ని స్క్రీన్ పై కనిపిస్తాయి. అవసరమైతే ఈ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.ఓకే మొబైల్ నెంబర్ పై మీ కుటుంబంలోని నలుగురు వ్యక్తుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయానికంటే ముందుగా కేంద్రానికి చేరుకొని సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలి.

*వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఇచ్చిన గుర్తింపు కార్డులు తీసుకుని వెళ్లాలి.ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై ఎటువంటి సందేహాలు ఉన్నా హెల్ప్ లైన్ నంబర్ 1075 కి ఫోన్ చేసి మీ సందేహాలను అడగవచ్చు.

*ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.

Advertisement

Featured

Rashmika: మై డార్లింగ్.. పార్టీ కావాలంటున్న రష్మిక.. రౌడీ హీరో రిప్లై ఇదే?

Published

on

Rashmika: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే రష్మిక ఒకవైపు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలు గురించి మాత్రం ఈమె స్పందించడం లేదు కానీ తరచూ వీరిద్దరూ వెకేషన్ లోకి వెళ్లడం ఒకే చోటే కలిసి పార్టీలు చేసుకోవడం వంటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఇదిలా ఉండగా తాజాగా మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Advertisement

ఆల్ ది బెస్ట్ మై లవ్..
మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురామ్ కు నా బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోయే ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు నాకు పార్టీ కావాలి ఆల్ ద బెస్ట్ మై లవ్ మృణాల్ ఠాకూర్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement
Continue Reading

Featured

Manoj -Charan: అర్ధరాత్రి ఫోన్ చేసి 5 లక్షలు అడిగాను.. చరణ్ మంచి మనసు పై మనోజ్ కామెంట్స్!

Published

on

Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.

Advertisement

ఆడబిడ్డకు సాయం..
ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vijay Devarakonda: సినిమా సక్సెస్ కోసం పూజలు చేసిన ఫ్యామిలీ స్టార్… సక్సెస్ అయ్యేనా?

Published

on

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే పరశురాం దర్శకత్వంలో నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మంచి సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలను చేశారు ఈ క్రమంలోనే దిల్ రాజు ఆఫీస్ లో దర్శక నిర్మాతలు హీరోలతో కలిసి ప్రత్యేకంగా హోమాలు పూజలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

సినిమా విజయం కోసమే పూజలు..
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ ఇలాంటి పూజలు చేయించారని అయితే ఈ పూజలు సక్సెస్ అయ్యి తన సినిమా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ ఈ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!