Harsha Bhogle: ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే కిడ్నాప్ కు గురయ్యారంటూ గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ చానెల్ నిర్వహించిన ఇన్స్టా లైవ్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న హర్ష చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి ఎంఎస్ ధోని తప్పుకోవడంపై ఇన్స్టా లైవ్లో ఉన్నఫలంగా కనిపించకుండా పోయారు.
ఇలా ఈయన స్క్రీన్ పై కనిపించకపోవడమే కాకుండా “క్యా హువా? కౌన్ హై? కహా సే ఆ గయే?” అని హర్షా భోగ్లే అని గట్టిగా అరవడంతో ఎవరో అతనిపై దాడి చేస్తున్నారని లేదా అతను కిడ్నాప్ గురయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలేం జరిగింది?అతనిని ఎవరు కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇక ఈ విషయం గురించి క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్.. ‘హర్షా భోగ్లేకి ఏమైందో, అక్కడేం జరుగుతుందో మాకు కూడా తెలియదు. అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం హర్షా భోగ్లే టీమ్తో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలో మీకు సమాచారం ఇస్తాం’అంటూ ట్వీట్ చేశారు. ఈ విధంగా ట్వీట్ చేయడంతో ఈ విషయం పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే చివరికి తెలిసిన విషయం ఏమిటంటే హర్ష భోగ్లే పై నిజంగానే దాడి జరగలేదని కేవలం ఈ కార్యక్రమం పై మరింత హైప్ తీసుకురావడం కోసమే ఇలా నాటకం ఆడారని తెలుస్తోంది.
ఇక అసలు విషయం తెలియడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హర్ష భోగ్లే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…ముందుగా అందరికీ క్షమాపణలు తెలియజేస్తూ ఎవరు ఆందోళన చెందకండి నేను క్షేమంగానే ఉన్నాను. నాపై ఎలాంటి దాడి జరగలేదు వీడియోలో భాగంగా ఇలా చేసాము. అయితే నేను చేసినది తప్పు అని తెలుసుకున్నాను. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ ఇబ్బంది పెట్టాలని ఇలా చేయలేదు మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. సారీ అండ్ ఛీర్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా అందరికీ క్షమాపణలు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…