Darshanam Mogilayya : తెలంగాణలో 12 మెట్ల కిన్నెర వాయిద్యం వాయించే కళాకారుడు కిన్నెర మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి కోటి రూపాయల నగదు, హైదరాబాద్ లో 300 గజాల స్థలం కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసారు. హైదరాబాద్ లోని బిఎన్ రెడ్డి నగర్ లో 300 గజాల స్థలం కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెర వాద్యం వాయించే కళాకారుడిగా కిన్నెర మొగిలయ్య గుర్తింపు తెచ్చుకున్నాడు. తన తండ్రి దగ్గర నేర్చుకున్న కళను ఆపేయకుండా కొనసాగించి అదే జీవనోపాధిగా బ్రతికాడు.
నాకేంది లొల్లి అంటూ అక్రోషం…..
కిన్నెర మొగిలయ్యకు పేరొచ్చింది మాత్రం భీమ్లా నాయక్ సినిమాతోనే. భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో పౌర పురస్కారం పద్మశ్రీ గౌరవంతో సత్కరించింది.
అంతవరకు అంత బాగానే ఉన్నా తనను మొదట గుర్తించింది కెసిఆర్ ప్రభుత్వమే అంటూ చెప్పి నాకు పద్మశ్రీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమని రాజకీయం మొదలవడంతో నా పొట్టకొట్టకండి, నాకే పద్మశ్రీ అవసరం లేదు, నా ఉసురు పోసుకోకండి అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా ఇపుడు కెసిఆర్ ప్రభుత్వం కోటి రూపాయల నగదు 300 గజాల ఇంటి స్థలం కేటాయించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…