Dasari Narayana Rao: చిరు, బాలయ్య, రాజశేఖర్ లకు అలాంటి ట్యాగ్స్ ఇచ్చిన దాసరి.. అవి ఏంటంటే?
Dasari Narayana Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణరావు పాత్ర ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా నిర్మాతగా నటుడిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సినీ పెద్దగా చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సేవలను అందించారు.
ఇప్పటివరకు చలన చిత్ర పరిశ్రమలో ఏ దర్శకుడు సృష్టించని రికార్డులను దాసరి తన సొంతం చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంపాదించారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి 15 చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకొని రికార్డును సృష్టించారు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఏ దర్శకుడు కూడా చేదించకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే దాసరి దర్శకత్వంలో 1992లో సూరిగాడు అనే అద్భుతమైన సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విజయవంతమైన తర్వాత దాసరి నారాయణరావు అప్పట్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ,రాజశేఖర్, మోహన్ బాబు గురించి మాట్లాడుతూ వారికంటూ ఒక ప్రత్యేకమైన ట్యాగ్స్ ఇచ్చారు. మరి దాసరి ఏ హీరోలకు ఎలాంటి ట్యాగ్స్ ఇచ్చారు అనే విషయానికి వస్తే…
దాసరి బాలయ్య గురించి మాట్లాడుతూ బాలకృష్ణ అందమైన నటుడు అంటూ ట్యాగ్ ఇచ్చారు.రాజశేఖర్ గురించి మాట్లాడుతూ ఏదైనా కొత్త పాత్రలలో చేయాలంటే రాజశేఖర్ అయితే బాగుంటుంది. అలా చేయడం అతనికే సాధ్యం అంటూ రాజశేఖర్ గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఈయన ఓ స్టార్ హీరో అంటూ దాసరి చిరుకి ట్యాగ్ ఇచ్చారు. ఇక నాగార్జున గురించి మాట్లాడుతూ నాగార్జున ఒక తెలివైన నటుడు, ఇక తన శిష్యుడు మోహన్ బాబు గురించి మాట్లాడుతూ మోహన్ బాబు ఒక గ్రేట్ ఆర్టిస్ట్.. హీరో కన్నా గొప్ప నటుడు అంటూ మోహన్ బాబుకు ట్యాగ్ ఇచ్చారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…