Pavan Kalyan : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పుడింగ్ పబ్ లో జరిగిన దాడుల్లో నిహారిక కొణిదెల పేరు రావడం చర్చకు దారి తీసింది. ఇక ఈ ఉదంతం పై దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది మెగా ఫ్యామిలీ. నాగబాబు వెంటనే స్పందించి నిహారిక కు డ్రగ్స్ విషయం లో ఇలాంటి సంబంధం లేదని అనవసరంగా కల్పితాలను ప్రచారం చేయొద్దని సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసారు.
ఇక నిహారికతో పాటు పబ్ లో ఉన్న సాయి రాజేష్ అనే యువ దర్శకుడు వరుస ట్వీటర్ లో అసలు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేసాడు.అసలు డ్రగ్స్ కు మాకు సంబంధం లేదని పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయలేదని చెప్పారు. అనవసరంగా నిహారిక పేరు ను తీసుకొచ్చారని చెప్పారు. ఇక గల్లా జయదేవ్ కుమారుడి విషయం లోనూ వాళ్ళు ఫ్యామిలీ మీడియా కు ఒక నోట్ వదిలారు. గల్లా అశోక్ కు ఆ పబ్ తో సంబంధం లేదని అనవసరంగా ఇందులోకి తన పేరును లాగుతోందని మీడియా కు వివరించారు.
పవన్ పోస్ట్ ఎవరికీ…..
నిహారిక ఇష్యూ మెగా ఫ్యామిలీ ని బాగానే ఇబ్బంది పెడుతోంది. మారి ఎక్కువగా పవన్ రాజకీయాలపై ఈ ప్రభావం పడనుంది. నీతులు చెప్పే ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి అంటూ ప్రత్యర్థుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి రావొచ్చు.అందుకేనేమో పవన్ సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ ను పెట్టారు. అందులో ఖచ్చితంగా నిహారిక ను మందలిస్తూ పెట్టారనే విషయం క్లారిటీ రాకపోయినా అందరు మాత్రమే పరోక్షంగా మందలించారాని అనుకుంటున్నారు.
ఆ పోస్ట్ లో పవన్ ఇలా రాసుకొచ్చారు బీసీలు, ఎస్సీలు కలిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్మనోహర్ లోహియా ఆలోచనల్ని పంచుకుంటూ రచయిత వాకాడ శ్రీనివాస్ వాఖ్యలను తాను ప్రస్తావిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. “శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది… అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే…” అని ట్వీట్ చేశారు. ఇక తన అన్న కుమార్తె నిహారిక పేరుపై రచ్చ సాగుతుండడంపై పవన్ తన అసహనాన్ని పరోక్షంగా వెల్లడించినట్టు చెబుతున్నారు. ఇలాంటి చర్యలతో ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టైందని పవన్ ట్వీట్ సారాంశంగా చెబుతున్నారు.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…