దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఎంతో పాపులర్ అయిన ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే దీప్తి సునయన షణ్ముఖ్ తో కలిసి ఉన్నటువంటి ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీరిద్దరూ కలిసి ఎన్నో వీడియో సాంగ్స్ లో నటిస్తూ బాగా పాపులర్ అవడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, బ్రేకప్ కూడా చెప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ, ఆ విషయం గురించి వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు.
ఇక ప్రస్తుతం షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే షణ్ముఖ్ యశ్వంత్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి దీప్తి సునయన తనని బాగా మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి “మలుపు” అనే ఒక షార్ట్ ఫిలింలో నటించారు. ఈ క్రమంలోనే ఈ షార్ట్ ఫిలింకి సంబంధించిన టీజర్ ను దీప్తి సునైనా ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల చేసిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టీజర్ లో జస్వంత్, దీప్తి రొమాన్స్ తో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పూర్తి వీడియో సెప్టెంబర్ 16న విడుదల కానుందని తెలియజేయడమే కాకుండా విత్ లవ్ షణ్ముఖ్ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్ళిన షణ్ముక్ ను దీప్తి సునైనా బాగా మిస్ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ప్రస్తుతం “మలుపు” టీజర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…