ప్రస్తుతం మన అందరి పరిస్థితి కరోనాకి ముందు కరోనా తరువాత అన్నట్టుగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ క్రమంలోనే ఈ వైరస్ వివిధ వేరియంట్ ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. ఇప్పుడిప్పుడే డెల్టా వేరియంట్ నుంచి ఇండియా కోల్పోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అధికారులకు డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ రెండవదశ రూపంలో వ్యాప్తి చెంది ప్రజలందరి జీవితాలను ఉక్కిరి బిక్కిరి చేసింది.అయితే అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించి ఈ మహమ్మారిని అరికట్టడంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కేసులు తగ్గాయి అనుకుంటున్న క్రమంలోనే డెల్టా వేరియంట్ సరికొత్త రూపం దాల్చి డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో దేశంలో చాపకింద నీరులాగా పాకిపోతోంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాగా, మరణాలు కూడా సంభవించాయి.ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినప్పటికీ ఈ వైరస్ వేరియంట్లను మార్చుకుంటూ ప్రజలపై పంజా విసురుతుంది. తాజాగా ఇండియాలో కొత్తగా 44,111 పాజిటివ్ కేసులు రాగా… మొత్తం కేసుల సంఖ్య 3,05,02,362కి చేరింది. దేశంలో కొత్తగా 738 మంది మరణించారు.మొత్తం మరణాల సంఖ్య 4,01,050కి చేరింది. మరణాల రేటు ఇండియాలో 1.3 శాతం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…