Devi Nagavalli insta video viral : గత రెండు రోజులుగా దేవి నాగవల్లి, విశ్వక్ సేన్ మధ్య జరిగినా వివాదం ఇంకా చల్లారలేదు. ఎవరో ఒకరు వారికి మద్దతు ఇస్తూ మళ్ళీ ఆ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఇక ఇరువురి తప్పు ఉన్నా కేవలం విశ్వక్ నే తప్పుబట్టడంతో నెటిజన్స్ దేవి పైన, టీవీ 9 పైన బాగా నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఒక జర్నలిస్ట్ గా దేవి సహనాన్ని కోల్పోకూడదు. స్టూడియోకి వచ్చిన గెస్ట్ ను వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఈ విషయాన్నీ మరచిపోయి దేవి విశ్వక్ ను పాగల్, డిప్రెస్డ్ పర్సన్ అనడం, ఇక ఆపై గెట్ అవుట్ అంటూ విరుచుకు పడటంతో సంయమనం కోల్పోయిన విశ్వక్ కూడా ఒక మహిళను అనకూడని మాట అన్నాడు.ఈ ఇష్యూలో దేవిది ఎంత తప్పు ఉందొ విశ్వక్ ది కూడా అంతే తప్పు ఉంది. అయితే విశ్వక్ మళ్ళీ తాను మాట్లాడినదానికి క్షమాపణలు చెప్పాడు ఇక్కడే దేవి మళ్ళీ పొరపాటు చేసింది. వెంటనే విశ్వక్ పై మంత్రి తలసాని కి ఫిర్యాదు చేయడం, లాంటివి చేసింది.
ఇద్దరి తప్పు ఉన్నా ఈ వివాదంలో దేవి తీరునే ఎక్కువగా నెటిజన్లు తప్పుబట్టారు. ఇక ప్రముఖ బీబీసీ ఛానల్ వారు దేవితో మాట్లాడటానికి ప్రయత్నించిన తనకు సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది అయితే విశ్వక్ మాత్రం తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయం గురించి మాట్లాడి తాను తప్పు చేయలేదంటూ ఎమోషనల్ అయ్యి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
సమాజం కోసం ఆలోచించే దేవినే అసలైన దేవి…..
అయితే తాజాగా దేవి ఈ వివాదం తరువాత తొలిసారి ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియోలో ఏదో గుడి మెట్ల మీద ఓ వృద్ధురాలు కూర్చుని, గుడి లోపలకి వెళ్లే వారిని బయటకు వచ్చేవారిని దానం చేయమని కోరుతుంది. కానీ ఎవరు ఆమెను పట్టించుకోరు. పైగా ఇదే సమయంలో ఆలయంలోకి వెళ్లే మెట్లు ఎక్కేముందు వాటి మీద కొన్ని బియ్యం పోసి దండం పెట్టుకుని పైకి ఎక్కుతున్నారు. ఈ ఆలయానికి వచ్చిపోయే వారు ఆ బియ్యం గింజల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు.
మనసులను మెలిపెట్టే ఈ దృశ్యాన్ని చూసి చలించిన దేవి నాగవల్లి ఆ బియ్యాన్ని అలా కింద పోసే బదులు ఆమె దోసిలిలో పోస్తే వాటికి సార్థకత లభించేది అనే వాఖ్యలతో తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఈ వీడియో ఎపుడు బాగా వైరల్ అవుతూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలైన దేవి ఇలా ఉంటుంది సమాజ హితన్ని కాంక్షిస్తూ తన వంతు ఏదైనా చేయాలనుకుంటుంది అంటూ నెటిజన్స్ ఎమోషనల్ కురిపిస్తున్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…