ఏ సినిమాలో అయినా అన్ని యాంగిల్స్ ఉండాలి. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, పాటలు అన్నీ బాగుంటేనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సినిమాలో ముఖ్యంగా కామెడీని ఎక్కువగా ఇష్టపడే వారు ఉన్నారు. ఇలా కమెడియన్ గా తమ కెరీర్ ప్రారంభించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.
అందులో ముఖ్యంగా రేలంగి దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు అందరూ ప్రేక్షకులను మెప్పించినవారే. అయితే డిఫరెంట్ స్లాంగ్ తో .. స్టైల్ తో కడుపుబ్బా నవ్వించిన ధర్మవరపు సుబ్రమణ్యం గురించి అందరికీ తెలిసిందే. అతడు ఈ మధ్య కాలంలో మరణించాడు. ఆ లోటును ఎవరూ పూడ్చలేనిది. అయితే ఇటీవల ధర్మవరపు సుబ్రమణ్యం కొడుకు రవితేజ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇంకా ఎన్నో విషయాలను చెప్పాడు. అందులో ముఖ్యంగా వాళ్ల నాన్న దగ్గర పనిచేసే ఓ వ్యక్తి గురించి చెబుతూ ఎంతో ఆక్రోశించాడు. తనకు సినిమాలో హీరో అవ్వాలని ఉంది.. తనకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం.. నాకు మీ రిఫరెన్స్ కావాలని అడిగినప్పుడు అతడు చెప్పిన మాటలకు ఎంతో బాధపడ్డానని అన్నాడు. నీ యాక్టింగ్ గురించి నాకు తెలియనప్పుడు నేను రిఫరెన్స్ ఎలా ఇస్తాను అంటూ అవమానంగా మాట్లాడాడని చెప్పాడు.
దాంతో అతడు ఎంతగానో బాధపడ్డాడని అన్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం బతికి ఉన్న సమయంలో అతడికి ఎంతో సహాయం చేశాడని.. సహాయం తీసుకొని ఇప్పుడు తాము ఎవరో అన్నట్లు మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకరి సహాయంతో ఎంత ఎత్తుకు ఎదిగినా.. తిరిగి సహాయం చేసిన వాళ్లను.. వాళ్ల ఫ్యామిలీని గుర్తుపెట్టుకోవాలి.. లేదంట అతడు మనిషే కాదు అంటూ తన మనస్సులో అనుకున్నట్లు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు రవితేజ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…