ఏ సినిమాలో అయినా అన్ని యాంగిల్స్ ఉండాలి. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, పాటలు అన్నీ బాగుంటేనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సినిమాలో ముఖ్యంగా కామెడీని ఎక్కువగా ఇష్టపడే వారు ఉన్నారు. ఇలా కమెడియన్ గా తమ కెరీర్ ప్రారంభించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.
అందులో ముఖ్యంగా రేలంగి దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు అందరూ ప్రేక్షకులను మెప్పించినవారే. అయితే డిఫరెంట్ స్లాంగ్ తో .. స్టైల్ తో కడుపుబ్బా నవ్వించిన ధర్మవరపు సుబ్రమణ్యం గురించి అందరికీ తెలిసిందే. అతడు ఈ మధ్య కాలంలో మరణించాడు. ఆ లోటును ఎవరూ పూడ్చలేనిది. అయితే ఇటీవల ధర్మవరపు సుబ్రమణ్యం కొడుకు రవితేజ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇంకా ఎన్నో విషయాలను చెప్పాడు. అందులో ముఖ్యంగా వాళ్ల నాన్న దగ్గర పనిచేసే ఓ వ్యక్తి గురించి చెబుతూ ఎంతో ఆక్రోశించాడు. తనకు సినిమాలో హీరో అవ్వాలని ఉంది.. తనకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం.. నాకు మీ రిఫరెన్స్ కావాలని అడిగినప్పుడు అతడు చెప్పిన మాటలకు ఎంతో బాధపడ్డానని అన్నాడు. నీ యాక్టింగ్ గురించి నాకు తెలియనప్పుడు నేను రిఫరెన్స్ ఎలా ఇస్తాను అంటూ అవమానంగా మాట్లాడాడని చెప్పాడు.
దాంతో అతడు ఎంతగానో బాధపడ్డాడని అన్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం బతికి ఉన్న సమయంలో అతడికి ఎంతో సహాయం చేశాడని.. సహాయం తీసుకొని ఇప్పుడు తాము ఎవరో అన్నట్లు మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకరి సహాయంతో ఎంత ఎత్తుకు ఎదిగినా.. తిరిగి సహాయం చేసిన వాళ్లను.. వాళ్ల ఫ్యామిలీని గుర్తుపెట్టుకోవాలి.. లేదంట అతడు మనిషే కాదు అంటూ తన మనస్సులో అనుకున్నట్లు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు రవితేజ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…