Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా దిల్ రాజు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడేవారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమాల గురించి కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. దిల్ రాజు గత రెండు సంవత్సరాల క్రితం తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే ఈయన తేజస్విని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటూ తాజాగా తమ లవ్ స్టోరీని బయటపెట్టారు.
దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈయన ఒంటరిగా ఎన్నో కష్టాలను అనుభవించానని, ఆ సమయంలోనే తనకు తోడు అవసరమనిపించే రెండో పెళ్లికి సిద్ధమయ్యానని తెలిపారు. అయితే నా బిజీ షెడ్యూల్ కారణంగా తనని అర్థం చేసుకునే వారు అయితే బాగుంటుందని ఆలోచించాననీ తెలిపారు.
ఇక తేజస్విని ఎయిర్ హోస్టర్స్ గా పని చేస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ప్రతిసారి తేజస్విని గమనిస్తూ ఉండేవారట. ఇలా ఏడాది పాటు తనని గమనించిన తర్వాత తన ఫోన్ నెంబర్ తీసుకొని అనంతరం తనకు ప్రపోజ్ చేశానని నా ప్రపోజల్ ఒప్పుకున్న తర్వాతే ఈ విషయం ఇంట్లో వారికి చెప్పి ఇద్దరం పెళ్లి చేసుకున్నామని ఈ సందర్భంగా దిల్ రాజు తన లవ్ స్టోరీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…