Dil Raju: డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి లాభాలను అందుకొని మొదటిసారిగా దిల్ సినిమాని నిర్మించారు.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఏకంగా ఈ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా పక్కన చేరడంతో ఈయన ఇండస్ట్రీలో దిల్ రాజుగా స్థిరపడిపోయారు.
ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు.ఇన్ని రోజులు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలను కూడా నిర్మిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మృతి చెందడంతో తేజస్విని అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ దంపతులకు జూలై 29వ తేదీ పండంటి కుమారుడు జన్మించారు.ఇలా దిల్ రాజు కుటుంబానికి వారసుడు రావడంతో ఎంతో మురిసిపోయిన దిల్ రాజు తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇకపోతే తాజాగా దిల్ రాజు అతని భార్య తేజస్విని కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనం అనంతరం దిల్ రాజు ఆలయం వెలుపలకు రావడంతో మీడియా ఒక్కసారిగా అతనిపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఈయన కుమారుడితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…