Dil Raju: డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి లాభాలను అందుకొని మొదటిసారిగా దిల్ సినిమాని నిర్మించారు.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఏకంగా ఈ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా పక్కన చేరడంతో ఈయన ఇండస్ట్రీలో దిల్ రాజుగా స్థిరపడిపోయారు.

ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు.ఇన్ని రోజులు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలను కూడా నిర్మిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మృతి చెందడంతో తేజస్విని అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ దంపతులకు జూలై 29వ తేదీ పండంటి కుమారుడు జన్మించారు.ఇలా దిల్ రాజు కుటుంబానికి వారసుడు రావడంతో ఎంతో మురిసిపోయిన దిల్ రాజు తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Dil Raju: శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు…
ఇకపోతే తాజాగా దిల్ రాజు అతని భార్య తేజస్విని కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనం అనంతరం దిల్ రాజు ఆలయం వెలుపలకు రావడంతో మీడియా ఒక్కసారిగా అతనిపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఈయన కుమారుడితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






























