Director Lakshmi Sowjanya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్లు నందిని రెడ్డి తర్వాత తెలుగులో వరుడు కావలెను చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె చిన్నప్పటినుంచి డైరెక్టర్ కావాలన్న కోరికతో ఈ రంగం వైపు అడుగులు వేస్తూ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత వరుడు కావలెను చిత్రానికి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.
ఇలా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మీ సౌజన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. లక్ష్మీ సౌజన్య తండ్రి లెక్కల మాస్టర్ కావడంతో తను కూడా అలాగే టీచర్ కావాలన్న ఉద్దేశంతో తన తండ్రి తనని చదివించారని తెలిపారు. చిన్నప్పుడే చాలా ఎత్తుగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు తనని చూసి ఇంకా ఆరవ తరగతెనా అంటూ హేళన చేయడంతో ఏకంగా తన తండ్రి పదవతరగతి పరీక్షలు రాయించారని ఇలా పదకొండు సంవత్సరాలకే పదవ తరగతి పూర్తి చేసినట్లు తెలిపారు.
10 పూర్తికాగానే తనకు MEC తీసుకోవాలనే కోరిక ఉండేదని తన తండ్రి మాత్రం ఎంపీసీ తీసుకోవాలని ఒత్తిడి చేసి.. ఎంపీసీ జాయిన్ చేశారని చెప్పారు.అయితే తనకు లెక్కలు అంటే ఏమాత్రం ఇష్టం లేదని తెలిపిన సౌజన్య ఇంటర్ ఫెయిల్ అయ్యారు.ఇలా ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో నాకు చదువు అంటే ఇష్టం లేదు నేను చదవను సినిమాలకు డైరెక్టర్ అవుతానని చెప్పినట్లు వెల్లడించారు.
ఇలా తను ఇంటర్ ఫెయిల్ అయ్యి సినిమాలలోకి రావాలని ఉందని చెప్పడంతో తన తండ్రి బెల్ట్ తీసుకొని కొట్టారని ఈ ఇంటర్వ్యూలో లక్ష్మీ సౌజన్య వెల్లడించారు. ఇక తాను ఏ విషయమైనా ఒక్కసారి చెప్పానంటే అది తప్పకుండా తీరాలని, తనకు నచ్చని పనిని అసలు ముట్టుకోని లక్ష్మీ సౌజన్య తెలిపారు.ఇక తన నిర్ణయం చెప్పడంతో తన తండ్రి ముందు చదువుకొమ్మని అప్పటికి కూడా సినిమాలపై ఇంట్రస్ట్ ఉంటే అటువైపే పంపిస్తానని మాట ఇచ్చారని ఆ విధంగానే తాను మాస్టర్ డిగ్రీ వరకు చదువు పూర్తి చేసి అనంతరం ఇండస్ట్రీ వైపు వచ్చానని ఈ సందర్భంగా లక్ష్మీ సౌజన్య తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…