తన తండ్రి ఆనాటి స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించే పెద్ద నిర్మాత. ఆరాధన, ఆత్మబలం, దసరా బుల్లోడు చిత్రాల పేరు చెప్పగానే జగపతి ఆర్ట్ పిక్చర్స్ గుర్తుకొస్తుంది. సినీరంగంలో వి.బి.రాజేంద్రప్రసాద్ కు అక్కినేని నాగేశ్వరరావు పరిచయం ఉండడంతో ఆయన తోనే ఎక్కువ సినిమాలను రూపొందించారు.
వి.బి.రాజేంద్రప్రసాద్ సినిమాలను నిర్మిస్తూ కుటుంబానికి దూరంగా ఉండడం చూసిన తన భార్య.. కొడుకు కూడా సినిమాల్లోకి వెళ్ళకూడదని ఒట్టు వేయించుకుంది. అలా మద్రాసులోనే ఉన్నత విద్యను పూర్తి చేసిన తన కొడుకు ఎందుకో సినిమాల్లో నటించాలనుకున్నాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అది కాస్త కో-డైరెక్టర్ ద్వారా నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ కు తెలిసిపోయింది. కొడుకు ఉత్సాహాన్ని కాదనలేక హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనుకున్నాడు.
ఆ క్రమంలో 1988లో బాలీవుడ్ లో వచ్చిన “ఖత్రోన్ కి కిలాడి” అనే విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. అలా 1989 జగపతి ఆర్ట్ పిక్చర్స్, వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాణం, వి.మధుసూదనరావు దర్శకత్వంలో “సింహస్వప్నం” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో జగపతి బాబు, వాణివిశ్వనాథ్, శాంతిప్రియ, హీరో, హీరోయిన్లుగా నటించారు. కృష్ణంరాజు, జయసుధ మరో ప్రధాన పాత్రలో కనిపించారు. అలా మొదటి చిత్రంలోనే జగపతిబాబు హీరోగా ద్విపాత్రాభినయం పోషించారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందింది. ఆ తర్వాత వచ్చిన ‘అడవిలో అభిమన్యుడు’ లాంటి చిత్రాలు కూడా విజయాన్ని అందుకోలేక పోయాయి. సినీ పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో జగపతిబాబు గొంతు బాగోలేదని వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో ఆయనకు డబ్బింగ్ చెప్పించారు. ఆ తరువాత జగన్నాటకం, పెద్దరికం విజయాల అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గాయం’ చిత్రం జగపతిబాబు కి మాస్ హీరోగా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘శుభలగ్నం’ ‘మావి చిగురు’ లాంటి చిత్రాలు ఆయనను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేశాయి.
ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “అంతపురం” చిత్రంలో సారాయి వీర్రాజు అనే అతిధిపాత్రలో జగపతిబాబు నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి తిరిగి బోయపాటి దర్శకత్వంలో వచ్చిన “లెజెండ్” చిత్రంలో ప్రతి కథానాయకుడి పాత్రలో కనిపించి జగపతిబాబు రెండో ఇన్నింగ్ ప్రారంభించారు.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…