Movie News

Director Teja: ఆంధ్ర ప్రజలకు సిగ్గులేదు.. ఆత్మ అభిమానం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ!

Director Teja: డైరెక్ట్ తేజ ప్రస్తుతం అహింస సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఆంధ్రులకు సిగ్గు లేదని వారికి ఆత్మాభిమానం లేదు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి తేజా ఇలాంటి కామెంట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

డైరెక్టర్ తేజ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మనకు పంజాబ్ బ్యాంక్ ఉంది కెనరా బ్యాంక్ ఉంది. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు లేదని ఈయన వెల్లడించారు. దాదాపు 90 సంవత్సరాలకు పైగా సేవలను అందించిన ఆంధ్ర బ్యాంకు ను 2020 ఏప్రిల్ ఒకటవ తేదీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారని అయితే ఈ బ్యాంకును విలీనం చేయటాన్ని అడ్డుకోవడానికి ఏ ఒక్క ఆంధ్రుడు ముందుకు రాలేదని ఈయన తెలిపారు.

Director Teja: ఆంధ్ర బ్యాంక్ విలీనం అడ్డుకోలేదు…

ఆంధ్ర బ్యాంకును విలీనం చేస్తున్న మనకేం సంబంధం లేనట్టు ఆంధ్ర ప్రజల వ్యవహరించారని అసలు వారికి ఏమాత్రం ఆత్మాభిమానం లేదని ఈ సందర్భంగా ఈయన మండిపడ్డారు. స్వాతంత్ర సమరయోధుడు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రాబ్యాంక్‌ని స్థాపించారు. 1980 లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఈ బ్యాంక్.. జాతీయ బ్యాంకుగా చేశారు.అయితే ప్రస్తుతం ఆంధ్ర బ్యాంక్ అనేది లేకుండా ఈ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారంటూ ఈయన ఆవేదన చెందారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అమావాస్య ప్రభావమా?.. స్కూల్ రీఓపెన్ రోజున క్లాస్‌లో ఒక్క విద్యార్థినే!

వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…

1 hour ago

ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు..మరో 4 రోజులు కుండపోతకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…

2 hours ago

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

2 hours ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

2 hours ago

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago